Mahbubnagar

News April 24, 2024

మానవపాడు: భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం !

image

భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మానవపాడు మండలం పెద్దపోతులపాడులో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ వివరాలు.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన పరశురాముడు పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన సుకన్యతో పదేళ్ల క్రితం పెళ్లయింది. భర్త తాగుడుకు బానిస అయ్యాడు. డబ్బు కోసం వేధించడంతో మాత్రలు వేసుకొని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 24, 2024

MBNR, NGKL..4 రోజులు.. 17మంది నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతుటండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. సోమవారం MBNR, NGKL స్థానాల పరిధిలో మొత్తం 10 నామపత్రాలు దాఖలయ్యాయి. ఐదుగురు కొత్తగా నామపత్రాలు సమర్పించగా మిగతా ఐదుగురు మరో సెట్టు నామినేషన్ వేశారు. నాలుగు రోజుల్లో MBNR,NGKL లోక్ సభ స్థానాల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు వేశారు.

News April 24, 2024

సలేశ్వరం జాతర.. పుల్లాయిపల్లి వరకే బస్సులు

image

NGKL: సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయితే పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. అచ్చంపేట డిపో నుంచి 16,NGKL 23, కొల్లాపూర్ 4,కల్వకుర్తి 4 బస్సుల చొప్పున మొదటి రోజు పుల్లాయిపల్లి వరకు 20 నిమిషాలు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు వీలుగా బస్సులు నడిపించినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు 50 ఆటోలు అందుబాటులో ఉంచారు.

News April 24, 2024

సలేశ్వరం జాతర.. భక్తుల జేబులకు చిల్లులు !

image

నల్లమలలో జరిగే సలేశ్వరం జాతరలో భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల్లో లీటర్ మంచినీళ్ల బాటిల్ రూ.50, ఒక కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్నట్లు భక్తులు తెలిపారు. లింగమయ్య ప్రసాదంగా భావించే 3 లడ్డూలను రూ.100కు విక్రయించారు. దీంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అటూ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు పల్లాయిపల్లి వరకే వెళ్తున్నాయి.

News April 24, 2024

నట్టడవిలో లింగమయ్య నామస్మరణ

image

తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతరకు తొలిరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి సమయంలో భక్తులను అనుమతి లేకపోవడంతో లింగమయ్యను దర్శించుకొనేందుకు పగలే బారులు తీరారు. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడ్డారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకైన కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.

News April 24, 2024

పాలీసెట్-24 ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువు పెంపు

image

వనపర్తి: పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే తేదీ పొడిగించబడిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని అన్నారు. రూ‌.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 24వ తేదీన ఉంటుందని తెలిపారు.

News April 24, 2024

NRPT: ఉద్యోగం రావడంలేదని యువకుడి సూసైడ్

image

ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన శివకుమార్(23) గ్రూప్, ఇతర పోటీ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో తోటివారికి ఉద్యోగాలు వచ్చి తనకు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.

News April 24, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి కార్యక్రమాలు

image

√NGKL,NRPT జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. అలంపూర్లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలు.
√NGKL:నేడు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం.
√MBNR: నేడు కవి సమ్మేళనం.
√ కోస్గి: నేడు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం.
√ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో నేడు కేంద్ర బలగాల కవాతు.
√ ఐజ: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
√ ధరూర్: నేడు కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. 

News April 24, 2024

నేడు PUలో జాతీయ సదస్సు

image

‘జీవవైవిధ్య పరిరక్షణలో ఇటీవలి పురోగతులు, స్థిరత్వం’ అనే అంశంపై ఈ నెల 23న ఉదయం 10గంటలకు పీయూ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ భవనంలో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ సదస్సు కన్వీనర్, బాటనీ విభాగాధిపతి పుష్పలత తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, విశిష్ట అతిథిగా ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.

News April 24, 2024

NGKL: సీఎం అయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి రాక

image

సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి నాగర్‌కర్నూల్ రానుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజినేపల్లిలోనే ప్రచార సభ నిర్వహించగా.. అక్కడే మల్లు రవి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. NGKL సాగునీటి అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. BJP, BRS నుంచి గట్టి పోటీ నేపథ్యంలో జిల్లాలో అధికంగా ఉన్న ఎస్సీ ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగే అవకాశం ఉంది.