India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అనేక అక్రమ భవనాలు కూల్చివేయడంతో ఉమ్మడి పాలమూరులో భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 11,360 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.23.81 కోట్ల ఆదాయం సమకూరగా.. ఆగస్టు నెలలో 7,315 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం గమనార్హం.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు

☞సురవరం <<14119741>>ప్రతాపరెడ్డి <<>>జన్మించిన గ్రామం? – ఇటిక్యాలపాడు
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు? – కోయిల్సాగర్
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు? – రామకృష్ణశర్మ
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు? – రాజా పెద్ద సోమభూపాలుడు, 1666
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? – రాజా బహిరీ గోపాలరావు
SHARE IT..

ప్రజా పాలన అంటే ఇలా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారంటీల అమలుపైనే తమ దృష్టి అంతా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వనపర్తి గ్రీన్ పార్క్ వినాయకుడి పెద్ద లడ్డూ రూ.2,50,116ల రికార్డు ధర పలికిందని గ్రీన్ పార్క్ యూత్ తెలిపారు. సమాధాన్ జాదవ్ వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్నాడన్నారు. పట్టణంలోనే రికార్డు ధరగా భావిస్తున్నామని చెప్పారు. చిన్న లడ్డు లక్ష్మీ బాలరాజ్ రూ.8,511కు, నోట్ల దండ పుష్పలత రూ.40,116కు, కలశం రమేష్ రూ.40,116కు, ఆపిల్ పండ్లు మద్దిలేటి రూ.10,116 వేలం పాటలో పొందారన్నారు. ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

☞సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన గ్రామం?
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు?
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు?
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్లో జవాబులను చూడోచ్చు.
SHARE IT..

జూరాలకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో మరింత తగ్గు ముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి కేవలం 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు వివరించారు. కాగా 9 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ మేరకు 22,241 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా 24, 695 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

బిజీనేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నవోదయ వెబ్సైట్లో చూడాలని చెప్పారు.

శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.