Mahbubnagar

News April 21, 2024

MBNR:’SUMMER CRICKET’ పేర్లను నమోదు చేసుకోండి!

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జడ్చర్ల, కోస్గిలలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 21న గద్వాల,NGKL,జడ్చర్ల, 22న కల్వకర్తి, 23న కోస్గిలో ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆఫ్లైన్‌లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఈనెల 24 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం HCA ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.

News April 21, 2024

మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులు, ప్రజలతో మాట్లాడుతారని, రోడ్ షో కూడా నిర్వహిస్తారని వెల్లడించారు. త్వరలోనే పర్యటన వివరాలు ప్రకటిస్తామన్నారు.

News April 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔అమ్రాబాద్: నేటి నుంచి అంజన్న స్వామి ఉత్సవాలు ప్రారంభం
✔నేడు నామినేషన్ ప్రక్రియకు సెలవు
✔కోయిలకొండ:నేటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు
✔నేడు GDWL,NGKL,జడ్చర్లలో వేసవి క్రికెట్ శిబిరాలు ప్రారంభం
✔పలు నియోజకవర్గంలో పర్యటించిన MLAలు,MP అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
✔మక్తల్:నేటి నుంచి బీరలింగేశ్వర స్వామి ఉత్సవాలు
✔కొనసాగుతున్న ‘DSC’ శిక్షణ

News April 21, 2024

NRPT: ‘నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలి’

image

వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే ర్యాంకింగ్లో వెనకబడి ఉన్నామని, పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. రైతు భీమా దరఖాస్తులు పెండింగ్లో పెట్టరాదని చెప్పారు. పంటల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.

News April 20, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

> సివిల్స్ టాపర్ అనన్య రెడ్డికి సత్కరించిన CM రేవంత్ రెడ్డి > BJP ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు: DK అరుణ > 22 నుంచి ‘ప్రజల వద్దకు పోలీస్’ ప్రారంభం: ఎస్పీ > NGKL: CM రేవంత్ సభ (ఈనెల 23) ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు > ఉమ్మడి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు > NRPT: తనిఖీల్లో 25.32 లీటర్ల మద్యం పట్టివేత > ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు ఇవ్వాలి: AIPKMS

News April 20, 2024

గద్వాల: ఈనెల 22 వరకు పాలీసెట్ కు దరఖాస్తు చేసుకోండి

image

పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న టీఎస్ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్షకు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని గద్వాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ టి. రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, ఇటీవల పరీక్షలు రాసిన వారు www.polycet.sbtet.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని, 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News April 20, 2024

ఈనెల 23న మద్దూర్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మ.ఒంటి గంటకు తిమ్మారెడ్డిపల్లి‌లో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ గురులోక మసంద్ (బావాజీ) జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల నేతలు తెలిపారు.

News April 20, 2024

MBNR: పాలమూరులో మూడు రోజులు వర్షాలు.!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News April 20, 2024

NGKL: నామినేషన్‌ల పర్వం.. అగ్రనేతల రాక

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో అన్ని పార్టీలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఈనెల 23న నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఈనెల 24న బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేయనుండగా రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 25న బీజేపీ అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలు సమర్పించనుండగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రానున్నారు.

News April 20, 2024

MBNR: శిక్షణ కేంద్రాలు.. టైం టేబుల్ ఇలా!

image

పట్టణం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానం, కోస్గి పట్టణం, జడ్చర్లలోని డిగ్రీ కళాశాల మైదానం, నాగర్ కర్నూల్ పట్టణం నల్లవెల్లి రోడ్డు చర్చి మైదానం, గద్వాలలోని డీఎస్ఏ మైదానాల్లో క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఉ.8:30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.