India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు మే 6వ తేదీలోపు చెల్లించాలని రీజినల్ కోఆర్డినేటర్ డా.జి.సత్యనారాయణగౌడ్ తెలిపారు. బీఏ, బీకాం విద్యార్థులు పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. బీఎస్సీ, కంప్యూటర్ విద్యార్థులు పేపరు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చే నెల 26 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు.
MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి రూ.3.31 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. పలు సంస్థల్లో 90% వాటా, మహదేవ ఇన్ఫ్రా ఇన్నోవేషన్స్ సంస్థలో 9 వేల షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద 24 తులాల బంగారం, సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.75 లక్షల విలువైన డైమెండ్ ఆభరణాలు, రూ.7.21 లక్షల విలువైన 9కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. కుటుంబానికి 10 ఎకరాల భూమి ఉంది. సొంతిల్లు లేదు. రూ.23.42 లక్షల అప్పులున్నాయి.
రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ పట్టణం సమీపంలోని ఏకో పార్కులో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి వికారాబాద్ జిల్లా బషీర్ బాద్ మండలం పర్వతానికి చెందిన తాండూరు లక్ష్మీ (26)గా పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్లో ముగ్గురు స్నేహితురాళ్లు కలిసి ఉంటూ.. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న ఊరికి వెళుతున్నానని తన మిత్రులతో చెప్పింది. యువతీ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
✔NRPT: నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ ✔బాలానగర్,నర్వ:నేడు భారాస కార్యకర్తల సమావేశం ✔అచ్చంపేట:కొనసాగుతున్న సలేశ్వరం జాతర ఏర్పాటు ✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు ✔నీటి ఎద్దడిపై అధికారుల అప్రమత్తం ✔NRPT:నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షిక క్రీడా దినోత్సవం✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔మరికల్:నేటి నుంచి వాలీబాల్ పోటీలు ప్రారంభం ✔వేసవి క్రికెట్ శిబిరాలపై అధికారుల ఫోకస్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వ్యవసాయ హబ్గా మారుస్తానని BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిస్కృతంగా ఉన్న ఈ ప్రాంత సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి MBNR ఎంపీ సీటు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. పార్లమెంట్ ఇన్చార్జిగా కొనసాగుతున్న సీఎం.. వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మరోవైపు ఈ స్థానంపై బిజెపి సైతం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి తీరాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కాగా ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది.
√MBNR: వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం.
√NGKL:BRS అభ్యర్థిగా RSP నామినేషన్ దాఖలు.
√ పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ:మాజీమంత్రి. √MBNR:కారు ఇక షెడ్డుకే: సీఎం రేవంత్ రెడ్డి.
√NRPT:తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: డీకే అరుణ.
√ 2వ రోజు MBNR..6,NGKL..3 నామినేషన్లు దాఖలు.
√ బిజినేపల్లి: అసభ్య ప్రవర్తన టీచర్ సస్పెండ్.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. NGKLకు తొలిరోజు భరత్ ప్రసాద్(BJP), మల్లురవి(INC) నామినేషన్ వేయగా, 2వ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS) నామినేషన్ వేశారు. MBNRకు తొలిరోజు డీకే అరుణ(BJP) నామినేషన్ వేయగా.. 2వ రోజు వంశీచంద్ రెడ్డి(INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS)తోపాటు 3 స్వతంత్ర అభ్యర్థులు హరేందర్ రెడ్డి, సరోజనమ్మ, ఉమాశంకర్ నామినేషన్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా వెలుగొండలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ధరూర్లో 44.3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 44.1, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 43.9, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 43.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసి, 14 లక్షల మంది వలసలకు కారణం అయిందన్నారు. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ సీఎం స్థాయిలో ఉండి అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడడం రేవంత్కే చెల్లిందని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.