India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివ్యాంగ <<13080058>>యువతి పట్ల అసభ్యకరం<<>>గా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి కలెక్టర్ ఉదయ్ కుమార్ సస్పెన్షన్ చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల టీచర్..యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపట్టినట్లు డీఈవో తెలిపారు.
మహబూబ్నగర్ స్థానిక MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 20న కళాశాల ప్లేస్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ కంపెనీలైన టాటా స్ట్రీవ్, రిలయన్స్ జియో, ఈఎమ్మారై, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్, రామ్ గ్రూప్ వంటి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, రెజ్యూమ్ రెండు సెట్లు తీసుకురావాలని తెలిపింది.
హత్య కేసులో నర్వ మండలం పెద్ద కడుమూరు గ్రామానికి చెందిన మొండి బాలరాజుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన మొండి శ్రీనును భూ తగాదాల కారణంగా 2022 జూన్ 11న బాలరాజు దాడి చేసి హత్య చేసినట్లు చేశారని.. ఈ కేసులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయడం మన అందరి అదృష్టమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. RS ప్రవీణ్ నామినేషన్ వేసిన అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మన జిల్లా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు.
మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి రవి నాయక్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మెట్టుగడ్డ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు. అది పాడైపోయిందని BRSను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. MBNRలో వంశీచంద్రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిన్న BRS అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.”20 మంది MLAలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి. మా MLAలను టచ్ చేస్తే మాడి మసైపోతావు” అని అన్నారు.
గద్వాల- ఎర్రవల్లి రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు గద్వాల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈనెల 24న నాగర్ కర్నూల్లో నిర్వహించే రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొనేందుకు రానున్నారు. 24న నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రవీణ్ కుమార్ మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసై పోతావ్ అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. గతంలో కేసీఆర్ను కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే ఈ జిల్లా ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నిప్పుల గుండంగా మారింది. రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన నీలకంఠం (32) పిడుగుపాటుతో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.