Mahbubnagar

News April 19, 2024

MBNR, NGKL స్థానాల్లోనూ త్రిముఖ పోటీయే!

image

MBNR, NGKL పార్లమెంట్ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు అన్ని గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీలు ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జీలను నియమిస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల అనంతరం ప్రచారం జోరుగా కొనసాగనుంది.

News April 19, 2024

MBNR: CM పర్యటనకు భారీ భద్రత

image

జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది.CM పర్యటనకు మొత్తం 1,500 మందితో పోలీసులు బందోబస్తు ఉండనున్నారు. నలుగురు ASPలు, DSPలు 15,CIలు 75,SIలు,100 ADIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 1,306 మంది విధుల్లో ఉండనున్నారు.

News April 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✒నేడు పాలమూరుకు CM రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వార్షిక పరీక్షలు
✒SA-2 మార్కులు నమోదు చేయండి:DEOలు
✒వేసవి క్రీడలపై అధికారుల ఫోకస్
✒CM పర్యటనకు భారీ భద్రత:SP హర్షవర్ధన్
✒నేడు నామినేషన్ వెయ్యనున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,వంశీ చంద్ రెడ్డి,స్వతంత్ర అభ్యర్థులు
✒పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
✒నేడు సివిల్ ర్యాంకర్లకు సన్మానించనున్న CM,జిల్లా నేతలు
✒ఉపాధి హామీ పనులపై అధికారుల నజర్

News April 19, 2024

NGKL: BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆస్తుల వివరాలు

image

నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తన కుటుంబానికి రూ.33.85 లక్షల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో రూ.15.86 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. తనపై కేసుల్లేవన్నారు. సొంత కారు లేదని, చేతిలో నగదు రూ.2 లక్షలు ఉన్నాయని, బైక్, 15 తులాల బంగారంతో కలిపి రూ.17.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కల్వకుర్తి మండలం గుండూరులో 7.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు.

News April 19, 2024

BJP అభ్యర్థి డీకే అరుణ ఆస్తుల వివరాలు

image

BJP అభ్యర్థి డీకే అరుణ గురువారం నామినేషన్ దాఖలు చేయగా.. అఫిడవిట్ వివరాలు సమర్పించారు. చరాస్తుల విలువ-రూ.3,21,73,518, స్థిరాస్తులు-రూ.3,10,00,000, బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు- లేవు, ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు- రూ.1,50,000, అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు: చరాస్తుల విలువ- రూ.23,26,16,353 స్థిరాస్తులు- రూ.37,17,80,000, అప్పులు-1,38,79,619, ప్రస్తుతం ఉన్న నగదు-రూ.20,000,00 ఉన్నట్లు తెలిపారు.

News April 19, 2024

నేడు నామినేషన్ వెయ్యనున్నది వీళ్లే!

image

మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా శుక్రవారం నామపత్రాలు దాఖలు చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

News April 19, 2024

MBNR: గీత దాటితే కొరడా ఝళిపిస్తారు..!!

image

ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. ప్రవర్తన నియమావళికి లోబడి పార్టీలు అభ్యర్థులు నడుచుకోవలసి ఉంటుంది. ప్రచార సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులు షాడో బృందాల ద్వారా నమోదు చేస్తున్నారు. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.

News April 19, 2024

బిజినేపల్లిలో కీచక ఉపాధ్యాయుడు

image

బిజినేపల్లిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ స్థానిక ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీలో మానసిక దివ్యాంగ యువతి(19) నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు సదరు టీచర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 19, 2024

MBNR: నేడు వంశీచంద్ రెడ్డి నామినేషన్‌.. సీఎం రేవంత్ రెడ్డి రాక

image

లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. MBNRలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వెయ్యనున్నారు. అనంతరం గడియారం చౌరస్తాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. CM పర్యటన కోసం జడ్చర్ల, MBNR ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 19, 2024

నాగర్ కర్నూల్ BSP అభ్యర్థిగా మంద పోటీచేస్తే ఎవరికి నష్టం..?

image

మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సామాజికవర్గం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్..