India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1.కొడంగల్-2,41,794
2.నారాయణ పేట-2,36,182
3.మహబూబ్ నగర్-2,59,260
4.జడ్చర్ల-2,22,838
5.దేవరకద్ర-2,39,745
6.మక్తల్-2,44,173
7.షాద్నగర్-2,38,478
8.వనపర్తి-2,73,863
9.గద్వాల-2,56,637
10.అలంపూర్-2,40,063
11.నాగర్ కర్నూల్-2,36,094
12.అచ్చంపేట-2,47,729
13.కల్వకుర్తి-2,44,405
14.కొల్లాపూర్-2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. అర్హులైన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా అధికారులు పిలుపునిచ్చారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో రూ.లక్ష లోపు 1,69,838 మంది రైతులకి రూ.952.7 కోట్లు రుణాలు, రెండో విడతలో 1,04,113 మందికి రూ.1,025.01కోట్లు, మూడో విడతలో 64,597 మందికి రైతులకు రూ.803.76 కోట్ల రుణాలు మాఫీ చేసింది. వీరందరూ కొత్త రుణాలను అర్హులైనప్పటికీ 40% మంది కూడా రుణాలు తీసుకోలేదు. ఇంకా మాఫీ కానీ రైతులు 2,10,560 మంది ఉండగా.. వీరందరూ రెన్యువల్ చేసేందుకు దూరంగా ఉన్నారు.

తండ్రి మందలించాడని పదోతరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మహ్మదాబాద్ మండలంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. దేశాయిపల్లికి చెందిన కృష్ణయ్య కూతురు శ్రీలత(14) ఈనెల 9న తన పుట్టిన రోజు ఉండడంతో తన తల్లి వద్ద రూ.200 తీసుకొని తోటి విద్యార్థులకు చాకెట్లు పంచింది. చాకెట్లు పంచడానికి డబ్బులు ఎక్కడివని శ్రీలతను తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం మహబూబ్ నగర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.

జూరాల జలాశయంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 11 గేట్లు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కులు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 8.531 TMCల మేర ఉంది. ఆలమట్టి జలాశయంలోకి 64 వేల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 40 వేలు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 40 వేలు చేరుతుండగా, దిగువకు 19 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

HYD, RR జిల్లాల్లో అనేక భవనాలు హైడ్రా కూల్చివేయటం పట్ల పాలమూరు జిల్లా వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గి స్థిరాస్తి వ్యాపారం పడిపోయింది. ఆగస్టులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 7,315 దస్తావేజులు నమోదు కాగా ప్రభుత్వానికి రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఆగస్టులో ఉమ్మడి జిల్లాలో 9,007 దస్తావేజులు నమోదు కాగా రూ.22.20 కోట్ల ఆదాయం వచ్చింది.

రాష్ట్రంలో సెప్టెంబర్ 17న ‘ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. MBNRలో మంత్రి జూపల్లి, GDWLలో ప్రభుత్వ క్రీడాకారుల సలహాదారులు జితేందర్ రెడ్డి, NGKLలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, NRPTలో గురునాథ్ రెడ్డి, WNPTలో ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024 కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం తదితర రంగాల్లో కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు http://awards.gov.in లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC
Sorry, no posts matched your criteria.