Mahbubnagar

News April 19, 2024

నాగర్ కర్నూల్ BSP అభ్యర్థిగా మంద పోటీచేస్తే ఎవరికి నష్టం..?

image

మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సామాజికవర్గం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్..

News April 19, 2024

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

NRPT జిల్లాలో గ్రామాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హత గల వ్యాయమ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్ళలోపు బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాయమ ఉపాధ్యాయులు సంబందిత ధ్రువపత్రాలతో ఈనెల 23లోగా జిల్లా క్రీడల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 18, 2024

పాలమూరులో తొలిరోజు నామినేషన్లు ఇలా..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఈ విధంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు నామినేషన్లు వేయగా.. ఇంటిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు.

News April 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✔ఉమ్మడి జిల్లాలో  భానుడి భగభగలు.. ఎల్లో హెచ్చరికలు జారీ
✔WNPT:MLA ఎదుట కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
✔నేడు నామినేషన్ వేసిన డీకే అరుణ, భరత్ ప్రసాద్, మల్లు రవి
✔బిజినేపల్లి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
✔బీఫామ్ అందుకున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,BMP అభ్యర్థి విజయ్
✔తాగునీటి పై అధికారుల ఫోకస్
✔SDNR:పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు
✔కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకే ఆత్మహత్యాయత్నం: గణేష్ గౌడ్

News April 18, 2024

పాలమూరులో మండుతున్న ఎండలు

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. గురువారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్గొండ గ్రామంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వెల్గొండకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు మధ్యాహ్నం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన్నే శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News April 18, 2024

అన్ని వర్గాల అభ్యున్నతికి మోదీ కృషి: డీకే అరుణ

image

దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. నామినేషన్ల దాఖలు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలు చేయని కాంగ్రెస్ నాయకులు కోతలు కోస్తున్నారని విమర్శించారు. రైల్వే మార్గాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామంటున్న CM రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎలా ఏర్పాటు చేస్తావని ప్రశ్నించారు.

News April 18, 2024

SDNR: పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు

image

ఫరుక్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో పోలీసులు ఓ వ్యక్తి వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చింతగూడెం గ్రామానికి చెందిన యాదయ్య వద్ద 59 జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నట్లు స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

News April 18, 2024

బిజినేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గుడ్లనర్వకి చెందిన శ్రీశైలం పాలెంలో టిఫిన్ కోసం వచ్చాడు. యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన బద్రీనాథ్ బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాగా.. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 18, 2024

MBNRలో ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు

image

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే ప్రచార పర్వం జోరందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో కురు క్షేత్రంగా మారనుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారానికి బారులు తీరనున్నారు. CM రేవంత్ రెడ్డి 3సార్లు జిల్లాలో పర్యటించారు.