India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీరామనవమి వేడుకలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’. ఈ గీతాన్నిమైకుల ద్వారా వినిపిస్తున్నారు. MBNR జిల్లాలోని పలు మండలాల్లో ఏ వీధిలో చూసిన ‘జై శ్రీరామ్’ నామస్మరణలే వినిపిస్తున్నాయి. మరి మీ ఏరియాలో ఫేమస్ టెంపుల్ ఏంటి? కామెంట్ చేయండి.
BJP లోక్సభ అభ్యర్థి డీకే అరుణ ఈనెల 18న ఉ.11గం.కు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉ.9గం.కు కేంద్ర మంత్రితో కలిసి డీకే అరుణ పిల్లల మర్రి రహదారిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, అక్కడి భారీ ర్యాలీతో నామినేషన్ వెయ్యనున్నట్లు తెలిపారు.
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం
✒ఏర్పాట్లు పూర్తి.. రేపటి నుంచి ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు ప్రారంభం
✒కృష్ణ:నేటి నుంచి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
✒పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MKAలు,MP అభ్యర్థులు
✒GDWL:నేటి నుంచి చింతలాముని రంగస్వామి ఉత్సవాలు
✒రాజోలి:నేటి నుంచి ఇస్మాయిల్, దస్తగిరయ్య దర్గా ఉత్సవాలు
✒తాగునీటి పై చర్యలు
✒పలు చోట్ల పోలీస్ కవాతు
సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరుగురికి ర్యాంకులు రాగా అనన్యరెడ్డి(MBNR) జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. అక్షయ దీపక్(MBNR)కు 196వ ర్యాంకు, ఎహతేదా ముపసిర్(ఆత్మకూర్)కు 278వ ర్యాంకు, యశ్వంత్ నాయక్(వెల్దండ- పోచమ్మ గడ్డ తండా) 627వ ర్యాంక్, అనుప్రియ(బాలానగర్- తిరుమలగిరి) 914వ ర్యాంక్, శశికాంత్(జడ్చర్ల- చాకలి గడ్డ తండా) 891వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.
క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్, MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో, క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్, వీఎన్ ఫెర్టిలైజర్స్, స్పందన స్ఫూర్తి, ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు, హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు.
ఈతకు వెళ్లిన గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం రాత్రి లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బొరుసుగడ్డతండా ఇప్పలతండాకు చెందిన లక్ష్మణ్ నాయక్(18) ఈనెల 13న శనివారం మిత్రులతో కలిసి వట్టెం వెంకటాద్రి జలాశయం వద్ద నీటి కుంటలో ఈతకు వెళ్లి గల్లంతుకాగా, 3 రోజులుగా గజ ఈతగాళ్లు, NDRF బృందాలతో గాలించగా.. మృతదేహం ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఆంజనేయులు నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదయింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రికెట్ ప్రియులకు ‘MDCA’ శుభవార్త తెలిసింది. ఉమ్మడి జిల్లాలో MBNR,NGKL,GDWL ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ‘MDCA అధికారులు మోసిన్, సతీష్,M. రాజశేఖర్ తెలిపారు. ఈనెల 18 వరకు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn.html వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 21 నుండి క్రికెట్ ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు.
SHARE IT
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి 19న ఉ.9.10 గం.కు నామినేషన్ దాఖలు చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కూడలిలో నిర్వహించే కార్నర్ సమావేశంలో సీఎం మాట్లాడతారని, మెట్టుగడ్డ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని ఆయన అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో పర్యటించారు. శాంతినగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.