India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం127 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 702 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలకు గరిష్ఠ ధర రూ.6,740 కనిష్ఠ ధర రూ.4,001 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,280, కనిష్ఠ ధర రూ.1767 లభించింది. కందులు గరిష్ఠ ధర రూ.6,771. ఆముదాలకు గరిష్ట ధర రూ.6,319. జొన్నలకు గరిష్ట ధర రూ.4,215 లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వడగళ్ల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టపరిహార నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో పంట నష్ట అంచనాపై అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ, మూసాపేట్, భూత్పూర్ మండలాలల్లో పంటలు నష్టపోయాయని వెంటనే వారికి సంబంధించిన నష్టపరిహార నివేదికనుసిద్ధం చేయాలన్నారు.
ఈ వారం ప్రజావాణికొచ్చిన 125 ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏ వారం ఫిర్యాదుల్ని ఆ వారమే పరిష్కరించాలని చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే పరిష్కరించి తనకు నివేదించాలన్నారు.
దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పెద్ద విస్తీర్ణం గల జిల్లా మహబూబ్నగర్ అని గుర్తు చేసి, ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించడంతో రవాణా సౌకర్యం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని కోరారు.
జూరాల ప్రాజెక్టులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక, బీజాపూర్కు చెందిన సుజయ్ కులకర్ణి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం పెళైంది. గత శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వచ్చి వారి నాన్నకి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ప్రజావాణికి బాధితులు క్యూ కట్టారు. ఈ ఫిర్యాదులో భాగంగా సోమవారం గిరిజన రుణాలు, భూమి, కార్మికుల, ప్రాజెక్టుల పరిహారం, సీనియర్ సిటిజన్స్, ఇందిరమ్మ ఇల్లు, భూముల కబ్జా, రైతులకుపంట నష్టపరిహారం తదితర సమస్యలపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి తమ గోడును విన్నవించారు. వారు స్పందించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి భూపాల్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారని, కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా పోరాటాలను మాత్రం ఆపలేరని భూపాల్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. కార్మికులకు రూ.18 వేతనం, పీఎఫ్, ఈపీఎఫ్, గ్రాటివిటీ, పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశాకార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.