Mahbubnagar

News September 6, 2024

MBNR: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..

image

విద్యుత్ సిబ్బంది ఏదైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని విద్యుత్తు సంస్థ సీఎండి శుక్రవారం ముషారఫ్ ఫరుఖీ తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది గానీ అధికారులు కానీ ఏదైనా పనికి లంచం అడిగితే 040-23454884, 7680901912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు శ్రీకారం చుట్టారు.

News September 6, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా కోదండపూర్‌లో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 89.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 76.3 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 64.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా జడ్ప్రోలు లో 55.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది.

News September 6, 2024

శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్

image

ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు శుక్రవారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,33, లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. స్పిల్ వే ద్వారా 55.874 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

News September 6, 2024

ఫ్రీ కరెంట్.. ఉమ్మడి జిల్లాకు రూ.20 కోట్ల భారం!

image

ఉచిత విద్యుత్తు సరఫరా వల్ల ఏటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల వరకు భారం పడనుంది. ప్రాథమిక పాఠశాలలో రూ.1,000, ప్రాథమికోన్నతలో రూ.1,500, ఉన్నత పాఠశాలల్లో రూ.2-3 వేలు. కళాశాలలు, గురుకులాల్లో రూ.5-8 వేలు, విశ్వవిద్యాలయల్లో రూ.10-15 వేలు, వైద్య కళాశాలల్లో రూ.15- 20 వేల వరకు బిల్లులు వస్తున్నాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేస్తామని ట్రాన్స్ కో ఎస్ఈ భాస్కర్ తెలిపారు.

News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరు నుంచి వెళ్తున్న హైవే- 44 దేశంలోనే ప్రత్యేకమైనది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. కాగా జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

News September 6, 2024

పాలమూరు ప్రాజెక్టును పడవ పెడతారా: నిరంజన్ రెడ్డి

image

అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లను రద్దు చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొని CM రేవంత్ రెడ్డి 9నెలల పాలనలో ప్రాజెక్టును కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. పెండింగ్ పనులను వెంటనే చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరులో గుండా వెళ్తున్న 44వ జాతీయ రహదారి దేశంలోనే ప్రత్యేకమైంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా ఉన్న జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఏడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఏడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

News September 6, 2024

వీపనగండ్ల: చోరీ కేసులో తండ్రీకొడుక్కి జైలు శిక్ష

image

చోరీ కేసులో తండ్రీకొడుక్కి వనపర్తి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. SI నందికర్ వివరాలు.. పెద్దకొత్తపల్లి మం. కల్వకోలుకు చెందిన తండ్రీకొడుకులు వెంకటస్వామి, గోపాలకృష్ణ 2020లో వీపనగండ్ల మం. తూంకుంటకు చెందిన ఎల్లమ్మ పొలం పనులకు వెళ్తుండగా మెడలోంచి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో ఇద్దరికి 2 ఏళ్లు జైలు, రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

News September 6, 2024

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: చిన్నారెడ్డి

image

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఇక.. ఇవాల్టి నుంచే విద్యాసంస్థలో ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

News September 6, 2024

ఉపాధ్యాయులు సమాజ సంస్కర్తలు: మంత్రి జూపల్లి

image

ఉపాధ్యాయులు సమాజాన్ని సంస్కరించే వ్యక్తులు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజపురోభివృద్ధికి పాటుపడే విధంగా వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులలో నిత్యం ప్రేరణకలిగిస్తూ, వారి తల్లిదండ్రులలోనూ పరోక్షంగా ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు.