India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
నారాయణపేటలో రాత్రి జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. జన జాతర సభకు వచ్చిన దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామానికి చెందిన ఎడ్ల బుగ్గప్ప గుండెపోటుతో మృతిచెందాడు. సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మధ్యాహ్నం సభకి వచ్చిన బుగ్గప్ప సభా ప్రాంగణంలోనే కుప్పకూలాడు. వెంట వచ్చిన కార్యకర్తలు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నారాయణపేటలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఈ మేరకు క్రీడా మైదానంలో నిర్వహించిన జనజాతర సభలో ప్రజలనుదేశించి మాట్లాడారు. “గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లోనే పెడతానని.. MBNR,NGKL పార్లమెంట్ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. నా పాలమూరులో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితే ఉండదని” అన్నారు.
ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై BRS చేస్తున్న పోరాటానికి భయపడే రేవంత్ ప్రకటన చేశారన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన 2023-24 ఏడాది టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఇందులో WNPT, NGKL జిల్లాకు చెందిన 637 మంది ఉపాద్యాయులు పాల్గొన్నారు. ప్రతి టీచర్ ఒక రోజు 40 పేపర్లు వాల్యుయేషన్ చేశారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగిన వాల్యుయేషన్లో జిల్లాకు వచ్చిన 1,53,336 పేపర్లను దిద్ది విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో నిరంతరం పర్యవేక్షించి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెబెక్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. SDF ద్వారా మంజూరు చేసిన త్రాగునీటి సంబంధిత బోర్ వెల్ లు, మోటర్ లు, పైప్ లైన్ పనులు ప్రగతిలో ఉన్న పనులన్నీ వారం రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.
✏ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ:CM రేవంత్ రెడ్డి
✏KCR కట్టిన సెక్రటేరియట్లో కూర్చోకండి: నిరంజన్ రెడ్డి
✏MP ఎన్నికల్లో పాలమూరులో గులాబీ జెండా ఎగరాలి: హరీష్ రావు
✏కాంగ్రెస్కి 3,4 సీట్లు మాత్రమే వస్తాయి:మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
✏రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న BJPనేతలు
✏ఉమ్మడి జిల్లాలో పగలు సెగలు..రాత్రి చల్ల గాలులు
✏అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం:వంశీ చంద్ రెడ్డి
NRPT:ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జెండాను వదల్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జన జాతర సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండా వదలలేరని,కాంగ్రెస్ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించింది. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్కు మించింది లేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
NRPT:ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ‘జనజాతర సభ’లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలి. వారికి న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశాం” అని అన్నారు.
పాలమూరు పక్కనే కృష్ణా నది ఉన్నా.. గత బీఆర్ఎస్ పాలనలో మనకు చుక్క నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించిందని.. కానీ BRS, బీజేపీ పార్టీలు కుట్ర చేసి ఆపాయన్నారు. బీఆర్ఎస్ చిత్రహింసలు పెట్టినా.. తమ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని అన్నారు.
Sorry, no posts matched your criteria.