Mahbubnagar

News April 15, 2024

MBNR: నేడు పీయూలో ఉద్యోగ మేళా

image

హైదరాబాద్ దివీస్ ల్యాబ్స్ సంస్థలో ట్రైనీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఈనెల 15న పాలమూరు విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రకిరణ్ తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం-ఫార్మసీ, బీ-ఫార్మసీ, నాల్గో సెమిస్టర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 15, 2024

జనజాతర సభకు సర్వసిద్ధం.. భారీ బందోబస్తు

image

నేడు నారాయణపేటలో సీఎం రేవంత్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు SPలు, ఐదుగురు DSPలు, 25 మంది CIలు, 65 మంది SIలు, 75మంది హెడ్ కానిస్టేబులు, 415 మంది కానిస్టేబుళ్లు, గార్డులు, 50 మంది మహిళా పోలీసులు, రెండు రోప్ పార్టీలు, రెండు టీఎస్ఎస్పీ ప్లాటున్స్ , స్పెషల్ పార్టీ పోలీసులు, రెండు ఐటీబీపీ ప్లాటూన్స్‌లతో పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

News April 15, 2024

నారాయణపేటలో నేడు జన జాతర.. హాజరుకానున్న రేవంత్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు నారాయణపేట వస్తున్నట్లు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ 2వసారి వస్తున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం వ్యవధిలోనే మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో రెండోసారి రేవంత్ రెడ్డి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

News April 15, 2024

MBNR: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: వంశీ చంద్‌రెడ్డి

image

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

News April 14, 2024

MBNR: అడుగంటిన భూగర్భ జలాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాల్లో సాగు, తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జూరాల ప్రాజెక్ట్ పక్కనే ఉన్న ధరూర్ మండలంలోనూ ఫిబ్రవరిలో 26.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు మార్చిలో 39.19 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఒక్క నెలలోనే 12.35 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా, మదనాపురం మండలంలో మాత్రం భూగర్భ జలాలు కొంతమేరకు పైకి వచ్చాయి.

News April 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
✏CONGRESS,BJPలో భారీ చేరికలు
✏బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు:మల్లురవి
✏విద్యతోనే పేదరికాన్ని జయించాలి: మంత్రి జూపల్లి
✏NRPT:CM రేవంత్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
✏GDWL:రైలు ఢీకొని మహిళ మృతి
✏ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’
✏నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
✏రేపు కోస్గి‌కి మాజీ మంత్రి హరీశ్ రావు రాక

News April 14, 2024

MBNR: కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయి?: మాజీ మంత్రి

image

ముగ్గురు అభ్యర్థుల్లో స్థానికుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి అని, పిలిస్తే పలికే నాయకుడని ఎంపీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయని, బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందు ఉందని, ప్రతి ఒక్కరూ మరో సారి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి‌ని గెలిపించాలని కోరారు.

News April 14, 2024

MBNR: డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరికలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆదివారం మాజీ మంత్రి డీకే అరుణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. 3వ సారి నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2024

తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి: మాజీ ఎమ్మెల్యే

image

భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. బోనస్ ఇస్తా అని మద్దతు ధర కూడా రైతులకు ఇవ్వట్లేదని అన్నారు. తెచ్చిన తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకున్నాం, నాలుగు నెలల్లోనే తెలంగాణ‌లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

News April 14, 2024

MBNR: బీఆర్ఎస్‌కు సవాల్‌‌గా మారిన MP ఎన్నికలు

image

బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. సత్తా చాటేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి MBNRలో ఉన్న 2 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపిన పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు RSPవిస్తృతంగా‌ ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌, బీజేపీలోనూ బలమైన అభ్యర్థులు నిలవడం‌తో BRSసర్వశక్తులూ ఒడ్డుతోంది. దీనిపై మీ కామెంట్?