Mahbubnagar

News April 14, 2024

ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు

image

అర్హులైన యువతీ,యువకులు ఓటుహక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్డీవో మాధవి తెలిపారు. అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని,గ్రామ స్థాయిలో బీఎల్వో, మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో గడువులోగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో కూడా పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు

News April 14, 2024

MBNR: 17 మండలాల్లో ప్రమాద ఘంటికలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండల తీవ్రతతో రోజురోజుకు భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో వరి పొలాలు, కూరగాయలు నీరు అందక ఎండిపోతున్నాయి. 17 మండలాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వెల్దండ, ధరూర్, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, ధన్వాడ,హన్వాడ, గండీడ్, మానవపాడు, కేటిదొడ్డి, నవాబుపేట, గుండుమాల్, కల్వకుర్తి, కోయిలకొండ, కొత్తకోట, NGKL, మదనాపూర్ మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని రాజేంద్ర కుమార్ తెలిపారు.

News April 14, 2024

ఉమ్మడి పాలమూరులో ‘SUMMER CRICKET’

image

క్రికెట్ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న ఉమ్మడి పాలమూరులో సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు: MBNR:9440057849, GDWL:9885955633, NGKL:9885401701.
SHARE IT

News April 14, 2024

గురుకుల డిగ్రీలో ప్రవేశాలకు గడువు పెంపు

image

MJP బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పెంచినట్లు బీసీ గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అర్హులని, ఈనెల 28న ఉదయం 10 గం. ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News April 14, 2024

ట్రావెల్‌ బస్సు బీభత్సం.. వనపర్తి వాసి మృతి

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. నోవాపాన్‌ కూడలి సమీపంలో పటాన్‌చెరు నుంచి సంగారెడ్డివైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి కారు, ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి డివైడర్‌పైకి ఎక్కంది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు వనపర్తి జిల్లా రాజాపూర్‌నకు చెందిన కార్మికుడు మహేశ్‌(20)గా గుర్తించారు.

News April 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు వనపర్తికి కామారెడ్డి ఎమ్మెల్యే రాక
✔నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✔మక్తల్: అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✔ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు..APPLY చేసుకోండి
✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
✔నేడు PUలో జాబ్ మేళా
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔నేడు పాలమూరుకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

News April 14, 2024

15న ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపిక

image

మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపికను ఈ నెల 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేపడుతున్నట్లు సంఘం కార్యదర్శి భానుకిరణ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 14, 2024

NGKL: ఒకేరాత్రి 10 ఇళ్లలో చోరీ

image

వెల్దండ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి చెర్కూర్ గ్రామంలో ఏకంగా 10 ఇళ్లల్లో చోరీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, తులంన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ రవి గ్రామాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.

News April 14, 2024

నేడు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కేర్ 133వ జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండలాల ప్రజాప్రతినిధులు, పాల్గొని అంబేద్కర్ గ్రహానికి నివాళులర్పించారు. జిల్లాలోని పలు గ్రామాలలో అంబేద్కర్ ఉత్సవాల శోభయాత్ర నిర్వహించి డీజే పాటలకు నృత్యాలు చేయనున్నారు.

News April 14, 2024

MBNR: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

image

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.