Mahbubnagar

News April 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✏MBNR: మోదీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ
✏కాంగ్రెస్ లో చేరిన పలువురు BJP&BRS నేతలు
✏నేడుPU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్ విడుదల
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏BRS పార్టీని వీడే ప్రసక్తి లేదు: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
✏MBNR:పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి
✏తాగునీటి సమస్యలపై అధికారుల సమీక్ష
✏ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలకు టెంట్లు మంజూరు.

News April 13, 2024

MBNR: ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా సొసైటీ అధికారులు తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఒక సెషన్, మ.2:30 నుంచి సా.5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www .telanganaopenschool.org/ వెబ్ సైట్ లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 13, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటి “CRIME NEWS”

image

@ తెలకపల్లి: బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇద్దరికీ జైలు శిక్ష.
@అమ్రాబాద్:అక్రమ మద్యం పట్టివేత ముగ్గురిపై కేసు నమోదు.
@ మరికల్: అక్రమంగా తరలిస్తున్న మద్యం డబ్బులు పట్టివేత.
@ దౌల్తాబాద్: చంద్రకల్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ1.50 లక్షల పట్టివేత.
@ తాండూర్: హోటల్లో ఆత్మహత్య చేసుకున్న కోడంగల్ వాసి.

News April 13, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి “TOP NEWS”

image

√MBNR: పాలమూరు ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి.
√MBNR:మోడీని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి: DK అరుణ.
√ మద్దూర్: BRSనువీడియో ప్రసక్తి లేదు: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం.
√ భూత్పూర్: DK అరుణ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి వెన్నుపోటు: దేవరకద్ర ఎమ్మెల్యే.
√ మక్తల్: సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జలంధర్ రెడ్డి.
√ కొడంగల్: రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు: సందీప్ కుమార్ సుల్తానియా.

News April 13, 2024

మహబూబ్ నగర్ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

చైత్రమాసం వసంత రుతువు, ఏప్రిల్ 22 పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం తెలిపారు. ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు MBNR డిపో నుండి బస్సు బయలుదేరి ఏపీలోని కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, 22న సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 94411 62588, 73828 27102 సంప్రదించాలన్నారు.

News April 13, 2024

MBNR: పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి

image

పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లోని వివిధ మండలాలలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు.

News April 13, 2024

MBNR: మోదీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ

image

నరేంద్ర మోదీని తెలంగాణ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం కొత్తకోట మండల కేంద్రంలో, మదనాపురం, అడ్డాకల్ మండలాల బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే ప్రజలు మోసపోతారని ధ్వజమెత్తారు.

News April 13, 2024

NRPT: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

image

నారాయణపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ హరినారాయణ్‌ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తతో వచ్చిన విభేదాల కారణంగా బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News April 13, 2024

మక్తల్: కాంగ్రెస్ పార్టీలో చేరిన జలందర్ రెడ్డి

image

మక్తల్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలందర్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. 2 సార్లు మక్తల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జలందర్ రెడ్డి నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ఏర్పాటు చేసుకొని బలమైన నేతగా ఉన్న ఆయన పార్టీ మారడం బీజేపికి దెబ్బె అని పలువురు అంటున్నారు. వంశీచంద్ రెడ్డి, జితెందర్ రెడ్డి పాల్గొన్నారు.

News April 13, 2024

NGKL: మందు తాగొద్దని చెప్పారని వృద్ధుడి ఆత్మహత్య

image

మద్యం తాగొద్దన్నందుకు ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాజశేఖర్‌ వివరాలు.. చారకొండ మండలం నూకలచింతవాడిక తండాకు చెందిన కేతవత్‌ లచ్చిరామ్‌నాయక్‌(62) మద్యానికి బానిసయ్యాడు. తరుచు ఇంట్లో గొడవ పడుతుండగా మందు తాగొద్దని కుటుంబీకులు వారించారు. దీంతో నిన్న ఉదయం పొలం వద్ద లచ్చిరామ్ పురుగు మందు తాగగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. ఈమేరకు కొడుకు శివలాల్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.