Mahbubnagar

News April 11, 2024

ఈ రెండో శనివారం సెలవు లేదు: DEO గోవిందరాజులు

image

ఈనెల 13న రెండో శనివారం పాఠశాలలకు సెలవు లేదని NGKL, WNPT జిల్లాల డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు ఉంటుండగా ఈ నెలలో రెండో శనివారం పాఠశాలలకు పని దినమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు పనిచేసేలా సంబంధిత ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 11, 2024

MBNR, NGKL: 5ఏళ్లు.. 3,27,451 మంది ఓటర్లు

image

ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్‌సభ పరిధిలో 16,80,417, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.

News April 11, 2024

ఉమ్మడి పాలమూరులో రంజాన్ సందడి..!

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. అర్ధ రాత్రి వరకు షాపులను తెరిచి ఉంచుతున్నారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.

News April 11, 2024

MBNR: ‘సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు’

image

బీజేపీ అభ్యర్థి అరుణమ్మ దొరసానే ఆమెకు మొదటి నుండి వెన్నుపోటు రాజకీయాలు చేయడం నర నరాల్లో ఉందని పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మక్తల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణ వెన్నుపోటు రాజకీయాన్ని మీ సొంత తండ్రి గుర్తించారని తెలిపారు. నువ్వు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు.

News April 10, 2024

MBNR,NGKL నియోజకవర్గాల్లో ‘చేయి’ వ్యూహం!

image

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది.MBNR,NGKL పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలైన BJP,BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి,మల్లు రవి స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులతో ప్రచారంలో నిమగ్నమయ్యారు.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు పలు సూచనలు చేశారు. మీ కామెంట్?

News April 10, 2024

పాలమూరులో హీటెక్కిస్తున్న సమ్మర్ సీజన్.!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమ్మర్ సీజన్ హీటెక్కిస్తోంది. వేడిగాలులు ఉక్కిరి ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి ఎండలు దంచికొడుతుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 10, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి.. రేపే రంజాన్ పండుగ
♥దేవరకద్ర:ప్రాణం తీసిన ఈత సరదా..ఇద్దరు యువకులు మృతి
♥WNPT:రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
♥షాద్‌నగర్‌లో యాక్సిడెంట్..వ్యక్తి మృతి
♥దౌల్తాబాద్:చిరుతను చంపిన కేసులో నిందితులు అరెస్ట్
♥కాంట్రాక్టర్ల కోసం,పదవుల కోసం BJPలో చేరలేదు:DK అరుణ
♥కాంగ్రెస్,BJPలో పలువురు చేరిక
♥NRPT:8.85 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
♥’ఇఫ్తార్ విందు’లో హాజరైన నేతలు

News April 10, 2024

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.2,14,500 సీజ్: ఎస్పీ రితిరాజ్

image

లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలోని బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు రూ.2, 14, 500 సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీ కి అప్పగించినట్లు గద్వాల ఎస్పీ రితిరాజ్ తెలిపారు. బుధవారం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ. 60,000, రాజోలి సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద రూ.1,0000, గట్టు చెక్ పోస్ట్ వద్ద రూ. 54, 500 పట్టుబడినట్టు తెలిపారు.

News April 10, 2024

దేవరకద్ర: ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు యువకులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన దేవరకద్రలో చోటుచేసుకుంది. SI నాగన్న వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన వాకిటి శివకుమార్(22), హరిజన్ గణేష్(20) ఇద్దరు స్నేహితులు ఈరోజు కన్నయ్య బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. శివ కుమార్ బావిలోకి దిగి ఈత కొడుతుండగా గణేష్ కూడా మెల్లగా బావిలోకి దిగాడు. గణేష్‌కు ఈత రాక మునిగిపోతుండగా శివకుమార్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగి చనిపోయారు.

News April 10, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

image

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంతో రేవంత్ రెడ్డి విర్ర వీగుతున్నాడని.. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని పేర్కొన్నారు. ‘అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేసింది. కాంట్రాక్టర్ల కోసం, పదవుల కోసం బిజెపిలో చేరలేదు’ అని అన్నారు.