Mahbubnagar

News April 10, 2024

సంయుక్త ఖాతాల ప్రారంభానికి దరఖాస్తులు

image

NGKL: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్యర్యంలో ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తీసేందుకు HMలు దరఖాస్తు చేసుకోవాలని DEO డా.గోవిందరాజులు తెలిపారు. బ్యాంకు ఖాతాను తీసేందుకు MEOల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను బుధవారం వరకు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘం అధ్యక్షురాలు, HM పేరుతో సంయుక్త ఖాతా తీయాలన్నారు.

News April 10, 2024

NGKL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి కర్ణాకటకు వెళ్తున్న తుఫాన్ వాహనం బిజినేపల్లిలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్నవారిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2024

MBNR: పాలమూరు బిడ్డలకు సీఎం చొరవ చూపాలి: RSP

image

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పలు బస్తీలలో పర్యటిచారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు పొట్టకూటి కోసం పట్టణానికి చేరుకుని సంవత్సరాల గడుస్తున్న కనీసం పక్కా ఇల్లు ప్రభుత్వాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సందర్భంలో పాలమూరు బిడ్డలకు ఇల్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేసారని అన్నారు.

News April 9, 2024

NRPT: ‘అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా’

image

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే పోటీలో నుండి తప్పుకుంటానని అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15న నారాయణపేటలో నిర్వహించే జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని చెప్పారు.

News April 9, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి ముఖ్య వార్తలు!

image

♥ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు
♥ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
♥ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలో పాల్గొన్న స్థానిక MLAలు,కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు
♥నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
♥అచ్చంపేట యువతితో ప్రేమ.. పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్న యువకుడు
♥ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
♥ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థులు

News April 9, 2024

MBNR: లేగ దూడపై చిరుత దాడి

image

బిజినేపల్లి మండలం వసురాం తాండలో రాముడు నాయక్ అనే రైతు తాండ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో లేగ దూడపై చిరుత పులి దాడి చేసి చంపినట్లు మంగళవారం తెలిపారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే గిరిజనులు జంకుతున్నారు. ఫారెస్టు అధికారులు పంచనామా చేసి చిరుతపులి అవు దూడను చంపి తినేసినట్లు గుర్తించారు. అత్యవసరం అయితే తప్ప చుట్టుపక్కల గ్రామాల తాండా వాసులు బయటికి రావొద్దని అధికారులు తెలిపారు.

News April 9, 2024

MBNR: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

News April 9, 2024

MBNR: ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలో పాల్గొన్న పార్టీ నేతలు

image

ఉగాది పండగ సందర్భంగా నేడు శిల్పారామంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పండితులు పార్టీ నేతల జాతకాన్ని వివరించారు. అనంతరం నాయకులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

MBNR: ఓటు నమోదుకు మరో అవకాశం

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండగా ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు మరో అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాలతో ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం మరో అవకాశం ఈ నెల 15 వరకు ఓటరుగా నేరుగా ఆన్‌లైన్ లేదా బూత్ స్థాయి అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవడానికి గడువు పెంచింది. ఈనెల 15 వరకు వచ్చిన దరఖాస్తులు అన్నింటిని నమోదుకు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

News April 9, 2024

MBNR: పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్నాడు..!

image

యువతిని పెళ్లి చేసుకోనని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాలు.. RR జిల్లా కడ్తాల్ వాసి అశోక్(21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి అచ్చంపేటకు చెందిన యువతి(19) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెను ప్రేమ పేరిట లోబర్చుకుని మొఖం చాటేయడంతో PSలో ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకోనని అశోక్ గొంతు కోసుకున్నాడు.