Mahbubnagar

News April 8, 2024

ఓపెన్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారు !

image

డా.బీఆర్. అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మే 17 నుంచి 20వ తేదీ వరకు, మూడో సంవత్సరం పరీక్షలు వచ్చే నెల 17 నుంచి 22 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.braouonline.in లేదా ఎంవీఎస్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News April 8, 2024

అమ్రాబాద్: చెక్ పోస్టుల నిబంధనల సడలింపు

image

అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 11 వరకు అటవీ నిబంధనలను సడలించినట్లు అమ్రాబాద్ రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు వాహనాలను అనుమతించనున్నట్లు ఆదేశాలు వచ్చాయని, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ ఒకేసారి కాకుండా కొన్ని వాహనాలను కలిపి పంపిస్తున్నారు.

News April 8, 2024

దేవరకద్ర మార్కెట్‌కు వరుస సెలవులు

image

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరుసగా మొత్తం 6 రోజుల పాటు మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం ధాన్యం, ఉల్లి సీజన్‌ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడకుండా సెలవుల జాబితా విడుదల చేసినట్లు మార్కెట్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం అమావాస్య, మంగళవారం ఉగాది, బుధవారం కరి పండుగ, గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు ఉంటాయన్నారు. తిరిగి శనివారం ఒక్కరోజు లావాదేవీలు జరుగుతాయని చెప్పారు.

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏GDWL,NRPT&NGKL: పలు గ్రామాల్లో కరెంట్ కట్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ)-6:38,సహార్(మంగళ)-4:44
✏నేడు లోక్‌సభ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
✏నేడు పాలమూరుకు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ రాక
✏ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న ప్రముఖులు
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏ఉట్కూరు:నేటి నుంచి కాళికామాత జాతర ప్రారంభం
✏దేవరకద్ర:మార్కెట్ యార్డ్ కు వారం రోజులపాటు సెలవు
✏ఎలక్షన్ ఎఫెక్ట్.. పలుచోట్ల తనిఖీలు

News April 8, 2024

MBNR:’ఇఫ్తార్ విందు’.. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు

image

రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఆదివారం అమరచింతలో డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో ‘ఇఫ్తార్ విందు’ ఇచ్చారు. ఇందులో MBNR కాంగ్రెస్, BJP ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి, BJP రాష్ట్ర నాయకుడు కొండయ్య పాల్గొన్నారు.

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో చికెన్ ప్రియులకు చుక్కలు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ ధర రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో హరీస్ తయారీకి ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. చికెన్ రూ.350వరకు పెరిగే అవకాశం ఉంది. కోళ్ల ఎగుమతిలో రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు మొదటి స్థానంలో ఉంది.

News April 8, 2024

బ్యాక్ లాక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈనెల26 తుది గడువు

image

డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరిన విద్యార్థులు, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు
బ్యాక్ లాక్ పరీక్షల ఫీజు ఈ నెల 26వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణగౌడ్ తెలిపారు. విద్యార్థులు తమ సమీప ఆన్లైన్ కేంద్రాల్లో పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలని అన్నారు.

News April 8, 2024

MBNR: 550 మందికిపైగా అంగన్వాడీ టీచర్ల పదవీ విరమణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4321 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో అయిదేళ్లలోపు చిన్నారులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 30 వరకు 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, సహాయకులు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 550 మందికి పైగా పదవీ విరమణ పొందనున్నారు. ఈ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, సహాయకులకు రూ.50వేలు చెల్లించనున్నారు.

News April 8, 2024

MBNR: అక్రమ కట్టడాలను కూల్చిన ప్రభుత్వ అధికారులు

image

మహబూబ్ నగర్ పట్టణం శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలలో కొందరు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల సహకారంతో జేసిబిలతో తొలగించారు. సర్వేనెంబర్ 25లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టగా అధికారులు పలుమార్లు హెచ్చరించిన వినకపోవడంతో నేడు అక్రమాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి రక్త పోటు(BP) లేదా మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ రెండు జబ్బుల బారినపడి వారు MBNR జిల్లాలో 89,387 మంది, NGKL జిల్లాలో 68,574, NRPT జిల్లాలో 54,232, జోగులాంబ గద్వాల జిల్లాలో 52,265, వనపర్తి జిల్లాలో 42,448 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మూత్రపిండాలు దెబ్బతిని ప్రతినెలా డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకుంటున్న బాధితులు 1,242 మంది ఉన్నారు.