Mahbubnagar

News April 3, 2024

‘పార్లమెంటులో MBNR వాయిస్ వినిపించాలంటే బీజేపీని గెలిపించాలి’

image

పార్లమెంటులో పాలమూరు వాయిస్ వినిపించాలంటే ఇక్కడ బీజేపీని గెలిపించాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ధన్వాడ, మరికల్ మండలాల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు. నిరుపేదలకు రేషన్ బియ్యం, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ముద్ర లోన్స్, గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు బీజేపీ ఇస్తుందని గుర్తుచేశారు.

News April 3, 2024

నేటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటి నుండి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. పట్టణంలో భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో MBNR, GDWL, NRPT జిల్లాలకు సంబంధించిన సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొంటారు. NGKL జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో WNP, NGKL జిల్లాల సిబ్బంది మూల్యాంకనం ప్రక్రియలో పాల్గొనున్నారు. మూల్యాంకనం కోసం 1,800 ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చారు.

News April 3, 2024

NRPT: ‘ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

image

పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిఓ, ఏపిఓ లకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికలను సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒GDWL: ఈతకు వెళ్లి బాలిక మృతి
✒BRSకు ఓటేస్తే.. మీ ఓటు వృథా అయినట్లే: డీకే అరుణ
✒అలంపూర్ లో యాక్సిడెంట్.. ఒకరి మృతి
✒కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కన్నీళ్లు: గువ్వల బాలరాజు
✒MBNR&NGKL:’ఎండిన పంటలు.. ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి’
✒WNPT:చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
✒ఆరెంజ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్లు
✒పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
✒పలుచోట్ల ఇస్తారు విందు!

News April 2, 2024

గద్వాల జిల్లాలో రూ.11,54,200 సీజ్

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.11,54,200 పట్టుబడినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వాటికి సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రూ.11 లక్షలు, కేటీ దొడ్డి మండలం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ.54,200 సీజ్ చేశామని నగదును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు.

News April 2, 2024

గద్వాల: బావిలో‌ ఈతకు వెళ్లి బాలిక మృతి

image

గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News April 2, 2024

MBNR: వేసవి సెలవులు.. ప్రశ్నార్థకంగా బడుల భద్రత

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.

News April 2, 2024

BRSకు ఓటేస్తే.. మీ ఓటు వృథా అయినట్లే: డీకే అరుణ

image

ధన్వాడ: BRSకు ఓటేస్తే మీ ఓటు వృథా అయినట్లే అని బీజేపీ ఉపాధ్యక్షురాలు, MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం ధన్వాడ, మరికల్ మండలాలకు చెందిన బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS పని అయిపోయిందని, ఆ పార్టీకి ఓటేస్తే మీ ఓటు వృథా అవుతుందన్నారు.BJP గెలుపుపై కార్యకర్తలతో దిశానిర్దేశం చేశారు.

News April 2, 2024

MBNR, NGKLలో బీఆర్ఎస్ జెండా ఎగరేసేనా..?

image

ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో BRS గెలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. పలు జిల్లాల్లో క్యాడర్ కూడా బలంగా ఉంది. MP ఎన్నికల్లో తప్పకుండా BRS గెలుస్తుందని MBNR, NGKL అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమాలో ఉన్నారు. దీనిపై మీ కామెంట్..?

News April 2, 2024

అలంపూర్ చౌరస్తాలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.