India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడంలేదని తెలిపారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 155 ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నెలనెలా ఖాతాలో జీతాలు పడేటట్లు చేయాలని జాతీయ ఉపాధి హామీ సిబ్బంది కోరారు.
మహబూబ్ నగర్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కళాశాల (అశోక్ నగర్-వరంగల్)లో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 1 నుంచి 4 వరకు నిర్దేశిత వెబ్సైట్ www.tgtwguruculam.telangana.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు అయోమయంలో పడ్డారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్లో చేరారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పాలమూరులోని రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను AICC నియమించింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా AICC కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావులను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా ఎంబి కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకకు పార్లమెంటరీ అభ్యర్థులు డీకే అరుణ(బీజేపీ), చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నే శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్) హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయతను కనబరిచారు. అభ్యర్థులను చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు పాల్గొన్నారు.
✏WNPT: కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు
✏MLC ఎన్నిక.. చెల్లుబాటు ఓట్లను బట్టి గెలుపు నిర్దారణ:MBNR కలెక్టర్
✏నేను బహుజన ద్రోహిని కాదు:RS ప్రవీణ్ కుమార్
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఈస్టర్ వేడుకలు.. పాల్గొన్న MLAలు
✏MBNR:రేపటి నుంచి తైబజార్ రద్దు
✏ఇఫ్తార్ విందులో పాల్గొన్న.. స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✏కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం:BSP
ఉమ్మడి పాలమూరులో భానుడు మండుతున్నాడు. దీంతో వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండటంతో పేద, ధనిక తేడా లేకుండా వీటికి గిరాకీ పెరిగింది. సైజును బట్టి రూ.160 నుండి రూ.400 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ, ఓటుకు నోటు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసపూరితంగా ప్రవర్తించారని అన్నారు. పాలమూరు బిడ్డగా న్యాయం చేయాల్సిన వ్యక్తి ద్రోహం చేశాడని వాపోయారు. రానున్న రోజుల్లో పాలమూరు ప్రజలు రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు.
శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని 50వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్లో ముందుగా ప్రాదాన్యత ఓట్లను లెక్కించాక వాటిలో చెల్లుబాటు అయ్యే ఓట్లను బట్టి అభ్యర్థుల గెలుపు నిర్దారణ ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ రవినాయక్ ప్రకటించారు. ఆదివారం కలెక్టరేట్లో చేపట్టిన శిక్షణ నందు సిబ్బందికి వివరించారు. గెలుపు నిర్దారణ ప్రకటించాక కౌంటింగ్లో అభ్యర్థులకు కోటా వచ్చే వరకు కౌంటింగ్ను చివరి వరకు చేపట్టి గెలుపును ప్రకటిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.