Mahbubnagar

News September 11, 2024

MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

image

పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌‌లు ఉన్నాయి. SHARE IT

News September 11, 2024

MBNR: విషాదం.. దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం

image

దొంగతనానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మిడ్జిల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో యాజమాన్యం కంచెకు విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News September 11, 2024

తెలంగాణలో కషాయ జెండా ఎగరడమే లక్ష్యం: డీకే అరుణ

image

తెలంగాణలో కషాయ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నేడు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. దేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రతి కార్యకర్త 200 మందిని సభ్యత్వంలో చేర్పించాలని అన్నారు.

News September 11, 2024

MBNR: ఈనెల 12 న స్పాట్ అడ్మిషన్లు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News September 11, 2024

MBNR: ‘గమ్యం యాప్.. సమయాన్ని ఆదా చేస్తుంది’

image

మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

News September 10, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు..!

image

✔మాజీమంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి,KCR, MLAలు దిగ్భ్రాంతి ✔ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ✔ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి ✔జూరాల ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత ✔భారీగా తగ్గిన చికెన్ ధరలు ✔శ్వేతారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న నాయకులు ✔GDWL:12న జాబ్ మేళా,జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ✔ఘనపూర్: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారి ✔విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు

News September 10, 2024

ముగిసిన శ్వేతారెడ్డి అంత్యక్రియలు

image

నాగర్ కర్నూల్ జిల్లా అవంచలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. వారి వ్యవసాయ పొలంలో శ్వేతారెడ్డి చితికి కుమారుడు స్వరూన్ రెడ్డి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లక్ష్మారెడ్డిని పాలమూరు ప్రజాపతినిధులతోపాటు బీఆర్అస్ నాయుకలు పరామర్శించారు.

News September 10, 2024

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో వనపర్తి ఫోటో గ్రాఫర్

image

వనపర్తికి చెందిన ఎస్వీ రమేష్(నవీన ఫోటో పార్లర్) ప్రతిభ చాటారు. సౌత్ ఆఫ్రికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 15 రోజు నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరించిన ఆయన ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో చిత్రాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.

News September 10, 2024

అలంపూర్ నూతన పాలక మండలికి నేనంటే.. నేను.. ?

image

అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి నియమించే పాలక మండలిలో నేనంటే నేనంటూ రాజకీయ నిరుద్యోగులు ఎవరి ప్రయత్నాల్లో వారు తెరచాటు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గత పాలక మండలి నుంచి కొందరు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సంపత్ కుమార్ వర్గం నుంచి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు సీఎం సోదరుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు పోటీ పడుతున్నారు.

News September 10, 2024

శ్వేతారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

image

జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.