India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్యను భర్త చంపిన ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. CI నాగభూషణం రావు వివరాల ప్రకారం.. ఎద్దులగేరికికి చెందిన దంపతులు వెంకటేష్, మహేశ్వరి. భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానంతో గొడవ పడేది. ఈనెల 15న రాత్రి గొడవ పడగా.. భార్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. శనివారం అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు CI తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 2023- 24 విద్యా సంవత్సరంలో యూడైస్ ప్లస్ నిర్వహణకు సమగ్ర శిక్ష నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.7,02,920 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.MBNR జిల్లాకు రూ. 1,66,974,GDWL జిల్లాకు రూ.1,46,308,WNPT జిల్లాకు రూ. 99,572,NGKL జిల్లాకు రూ.1,56,658,NRPT జిల్లాకు రూ.1,33,408 వంతున మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న అధికారులు, పోలింగ్ రోజున ఓటు వేసే అవకాశం లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఏప్రిల్ 23లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆర్డీవో రామచందర్, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు ఉన్నారు.
ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన ఘటనపై ఉండవల్లి PSలో శనివారం కేసు నమోదైంది. SI శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు రమాదేవి ఆన్లైన్లో వాచ్ బుక్ చేసింది. వెంటనే వద్దనుకుని రద్దు చేసేందుకు వివరాల కోసం వెతికింది. ఆర్డర్ రద్దు చేయాలంటే ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో అలాగే చేసింది. కొద్దిసేపట్లో ఆమె ఖాతాలో రూ.83,286 డ్రా అయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. జిల్లాలో 6 చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అక్రమంగా నగదు, మద్యాన్ని తీసుకెళ్తున్న వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
నిరుద్యోగ, యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణలో మూడు నెలల పాటు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్,జర్దోసి, ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్,రిఫ్రిజిరేటర్, ఏసీ మరమ్మతుల్లో శిక్షణకు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికుల వివరాలిలా.. బాలానగర్ మండలం మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్(45) మోతిఘణపూర్ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. పట్టిన వాటిలో ఒక చేపను తినగా అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. సహచరులు దాన్ని తీసేలోపే అతనికి ఊపిరాడక మృతి చెందాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన అందించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వంద రోజుల పరిపాలన గురించి పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.
✒వనపర్తి: BRSకు బిగ్ షాక్.. 8 మంది కౌన్సిలర్లు రాజీనామా
✒MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
✒‘సోషల్ మీడియాపై పోలీసుల నిఘా’
✒దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
✒ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కుపై అవగాహన
✒జాగ్రత్త సుమా.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒MBNR:ZP చైర్పర్సన్ పై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం
✒పలుచోట్ల తనిఖీలు
Sorry, no posts matched your criteria.