Mahbubnagar

News March 28, 2024

అన్ని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 2023-24 విద్యా సంవత్సరానికి చివరి పని దినం ఈ నెల 30 (శనివారం)గా పేర్కొంటూ ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

News March 28, 2024

MBNR: ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో

image

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వేదికను సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభకు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలిపారు. అదే సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోందని చెప్పారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

News March 28, 2024

MBNR: పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే క్రాస్ ఓటింగ్ భయం ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారు పార్టీకి మరో షాక్ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు.

News March 28, 2024

తుక్కుగూడకు రాహుల్ గాంధీ: రేవంత్ రెడ్డి

image

కొడంగల్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారని, జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటిస్తారని వెల్లడించారు. సభా కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

News March 28, 2024

కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం

image

మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.

News March 28, 2024

NRPT: ‘సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే మిగతా డబ్బులు ఇస్తామని చెప్పే మాయ మాటలు నమ్మకండని చెప్పారు. అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ATM, OTP నంబర్లు ఇవ్వరదాని, ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

News March 28, 2024

MBNR: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్

image

మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 99.86% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. NGKL, NRPT నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఓటు వేయలేదు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 బూతులలో పోలింగ్ ఏర్పాటు చేశారు.

News March 28, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ స్థాయిలో పోలింగ్

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలలో 1439 మంది ఓటర్‌లకు గాను 1437 మంది ఓటర్‌లు (99.86%,) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ ఎం.పి.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 245 మందికి 245 మంది ఓటర్‌లు 100 శాతం పోలింగ్ నమోదయ్యింది.

News March 28, 2024

ప్రజలకు చేరువ అయ్యేలా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

పోలీస్ విధులు ప్రజలకు చేరువ అయ్యేలా ఉండాలని గద్వాల SP రితిరాజ్ సూచించారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డులు పరిశీలించారు. పనిచేయని సీసీ కెమెరాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది తమ సమస్యలను ఎస్పీతో మొరపెట్టుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.

News March 28, 2024

MBNR: ‘కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ’

image

ఎన్నికలు వస్తే ఎవరైనా తీర్థ యాత్రలకు వెళ్దాం అనుకుంటారు.. కానీ నాకు కొడంగల్‌కు వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే.. అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.