Mahbubnagar

News July 2, 2024

ఉమ్మడి పాలమూరుకు 131 మీసేవ కేంద్రాలు

image

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి పల్లెలో మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు 131 మీసేవ కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్క MBNR జిల్లాకే అత్యధికంగా 70, వనపర్తి జిల్లాకు అత్యల్పంగా 4 కేంద్రాలు మంజూరయ్యాయి. ‘మహిళా శక్తి’ పేరుతో మంజూరు చేస్తున్న మీసేవల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. ఇంటర్, ఆపై చదివిన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.

News July 2, 2024

MBNR: కోయిల్ సాగర్‌ను పరిశీలించిన కలెక్టర్..!

image

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగు నీరు అందుతుందనే వివరాలు ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News July 1, 2024

కొడంగల్: పురుగు మందు తాగి బాలుడు ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంటకు వెంకటేష్ (16) చదువు మధ్యలోనే వదిలేశాడు. కాగా అతను కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్దామని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లిన బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కొడంగల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి చెప్పారు.

News July 1, 2024

మక్తల్: సైబర్ కేటుగాళ్లకు ఝలక్ ఇచ్చిన టీచర్

image

మక్తల్‌కి చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీ సైబర్ నేరగాళ్లకు ఝలక్ ఇచ్చారు. నేరగాళ్లు జయశ్రీకి ఫోన్ చేసి ’ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పేరు మీద ముంబై నుంచి థాయిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ వెళ్లింది‘ అని చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. క్రైమ్ బ్రాంచ్‌లో తన అన్న పని చేస్తున్నాడని, ఫోన్ నంబర్ ఇవ్వాలని టీచర్ కోరింది. దీంతో కేటుగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

News July 1, 2024

MLA వంశీకృష్ణ, భార్య, కొడుకు, కుమార్తె.. అంతా డాక్టర్లే

image

అచ్చంపేట MLA వంశీకృష్ణ కుటుంబంలో అంతా డాక్టర్లే ఉన్నారు. వైద్యులుగా రాణిస్తున్న వారు.. పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి స్వయంగా ఎమ్మెల్యేనే 465 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. వంశీకృష్ణ( సివిల్ సర్జన్), ఆయన సతీమణి అనురాధ(గైనకాలజిస్ట్), కుమారుడు యశ్వంత్ కుమార్(ఎంబీబీఎస్), కూతురు యుక్తాముఖి(ఎంబీబీఎస్)గా ఉన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

News July 1, 2024

ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా దగడలో 37.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్ లో 36.5 మి.మీ, గద్వాల జిల్లా త్యాగదొడ్డిలో 32.3 మి.మీ, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 27.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 1, 2024

400 కిలోమీటర్ల రోడ్లకు రూ.143 కోట్ల అవసరం !

image

ఉమ్మడి జిల్లాలో రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 143 కోట్లు అవసరం ఉందని రోడ్ల భవనాల శాఖ అధికారులు అంచనా వేశారు. టెండర్లు పిలవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరు అవుతాయని, భావిస్తున్నారు.

News July 1, 2024

NGKL: ఆస్పత్రి నుంచి ఈశ్వరమ్మ డిశ్ఛార్జి

image

నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకోవడంతో నిమ్స్ నుంచి డిశ్ఛార్జి చేశారు. కొందరి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గత నెల 23న నిమ్స్‌లో చేర్చారు. 8 రోజులు చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు.

News July 1, 2024

NGKL: నేటి నుంచి అభయారణ్యంలో ప్లాస్టిక్ నిషేధం

image

అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ అభయారణ్యంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మన్ననూర్ ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ, వన్య ప్రాణుల వనగడను దృష్టిలో ఉంచుకొని అభయారణ్యంగా గుర్తించి ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడరాదన్నారు. వాటర్ బాటిళ్లు, బిస్కెట్ కవర్లు, పాలిథిన్ కవర్లు పడేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

News July 1, 2024

MBNR: ఆరు తడి పంటలకు ప్రాణం !

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆరుతడి పంటలైన పత్తి, జొన్న, మొక్క జొన్న, కంది పంటలకు ఊరట లభించింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల నుంచి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వర్షం పడకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉండగా.. ఈ వాన ఊపిరి పోసింది. ఈ వర్షంతో 15 రోజుల వరకు పంటలకు భరోసా దక్కినట్లేనని రైతులు అంటున్నారు.