Mahbubnagar

News March 24, 2024

MBNR: కిషన్ రెడ్డి సమక్షంలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు మెట్టు కాడి శ్రీనివాస్, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులకు పార్టీ కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి డీకే అరుణ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

News March 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రేపే హోలీ.. ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి: ఉమ్మడి జిల్లా పోలీసులు
✒NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి
✒CONGRESS, BJPలలో భారీ చేరికలు
✒SDNR:RTC బస్సులో రూ.16,50 లక్షల నగదు, వెండి సీజ్
✒NRPT:పత్తి మిల్లు దగ్ధం.. రూ.8 కోట్ల ఆస్తి నష్టం
✒MBNR:MLC ఉప ఎన్నిక.. గోవాకి వెళ్లిన ప్రజాప్రతినిధులు
✒‘టెట్ దరఖాస్తు రుసుం తగ్గించండి’.. పలుచోట్ల నిరసన
✒ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న MP అభ్యర్థుల ప్రచారం

News March 24, 2024

కొందుర్గు: లారీ ఢీకొని ఒకరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొందుర్గు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెక్కలోనిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(54) టీవీఎస్ వాహనంపై కొందుర్గు వైపు వెళ్తుండగా గొర్రెలు అడ్డు వచ్చాయి. గొర్రెలు తప్పించే ప్రయత్నంలో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆమనగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ బలరాం తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన అర్జున్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బ్రహ్మోత్సవాల సందర్భంగా తినుబండారాల దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే దుకాణానికి అతడితో పాటు వచ్చిన కుమారుడు జయదేవ్(3) అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె ఒంటిపై పడింది. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు.

News March 24, 2024

MBNR: వారం రోజుల్లో ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కే !

image

ఉమ్మడి జిల్లాలో 3,068కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 55 ఎమ్మార్సీలు, 208 సీఆర్సీలున్నాయి. వీటికి మొదటి విడతలో రూ.5.54 కోట్లు, రెండో విడతగా రూ.5.54 కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులను వారం రోజుల్లో మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే వెనక్కి వెళ్లిపోతాయి. స్టేషనరీ, పాఠశాల మరమ్మతులు, రంగులు వేయడానికి, ప్రయోగాలు, ఆటలు ఆడించేందుకు తదితర వాటి కోసం నిధులను ఉపయోగించి బిల్లులు అప్ లోడ్ చేయాల్సి ఉంది.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
>>>SHARE IT

News March 24, 2024

షాద్‌నగర్: RTC బస్సులో భారీగా నగదు, వెండి సీజ్

image

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద పోలీ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. RTC బస్సులో ఏలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి రూ.16,50 లక్షల నగదు, వెండి తరలిస్తుండగా సీజ్ చేశారు. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జయదేవ్ అనే యువకుడు అక్రమంగా తరలిస్తున్న నగదు వెండిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 24, 2024

ఉమ్మడి జిల్లాలో 91,357 ఎకరాల్లో ఎండిన పంటలు

image

ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. మొత్తం 8,04,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 5,34,150 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరందక సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం 91,357 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News March 24, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్

image

ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అచ్చంపేట మండలం అయినోలులో 40.7 డిగ్రీలు నమోదు కాగా, బిజినేపల్లి మండలంలో 40.5 నమోదయ్యాయి.

News March 24, 2024

NRPT: పత్తి మిల్లు దగ్ధం.. రూ.8 కోట్ల ఆస్తి నష్టం

image

మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ సమీపంలో ని బసవేశ్వర కాటన్ మిల్లులో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కన ఉన్న రైస్ మిల్లు కార్మికులు గమనించి యజమానికి, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంలో సుమారు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు.