India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేశంపేట మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో పదోతరగతి పరీక్ష శనివారం జరిగింది. కానిస్టేబుల్ వివరాల ప్రకారం.. నిడదవెళ్లి గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ పరీక్ష కేంద్రానికి కార్లో వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రం సీఎస్ నర్సింహులు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కృష్ణయ్యలను విధుల నుంచి తప్పించారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 28న జరగనున్న సందర్భంగా కాంగ్రెస్, BRS పార్టీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మారిన రాజకీయ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్ పేట మండలాలకు చెందిన BRS ప్రజా ప్రతినిధులు ఇటీవల రెండు ప్రైవేటు బస్సుల్లో గోవా శిబిరానికి తరలి వెళ్లారు.
✔వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలోని పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న క్షయ వ్యాధి సర్వే
✔NRPT:నేడు ‘రజాకార్’ సినిమా ప్రదర్శన ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN):6:35, జోహార్(MON):4:56 ✔పలు నియోజకవర్గలో స్థానిక MLAల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔MBNR:హోలీ..ప్రత్యేక రైళ్లు ✔ఎన్నికల కోడ్.. కొనసాగుతున్న తనిఖీలు ✔DSC(SA) ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవేందర్ గౌడ్, జయలక్ష్మి దంపతుల కుమారుడు భూపతి గౌడ్(17) ఇంటర్ పరీక్షలు ముగియగా.. ఖాళీగా ఉన్నాడు. ఓ బావిలో ఈత కొడుతుండగా.. పూడికలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.
ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. SP వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన లలిత(40) భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుంది. లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన శివుడుతో పరిచయం ఏర్పడింది. ఈనెల 13న బల్మూరు మండలం మైలారం గ్రామ శివారులో ఇద్దరు కలిసి మద్యం తాగారు. శివుడు తాగిన మైకంలో ఆమెను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహేశ్వరీ థియేటర్లో BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను ఆదివారం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పార్టీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు తెలిపారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల అణచివేత, ప్రజలు పడిన కష్టాలు, విముక్తి పొందిన చరిత్రను దర్శకుడు అద్భుతంగా చూపించారన్నారు.
✔డీకే అరుణ పూటకో పార్టీ మార్చారు:వంశీచంద్ రెడ్డి
✔అయిజ:ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి
✔NGKL:క్షయవ్యాధి నివారణకు సమీక్ష
✔ఉమ్మడి జిల్లాలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సాయుధ బలగాలతో కవాతు
✔NRPT:చెక్ పోస్ట్ తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలి:DSP
✔NRPT,GDWL:రేపు పలు గ్రామాలలో కరెంటు కట్
✔పాలమూరు అభివృద్ధికి ప్రణాళికలతో ఉన్నా:డీకే అరుణ
✔బెల్ట్ షాపులపై ఫోకస్
మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు పూటకు ఓ పార్టీ మార్చిన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ నన్ను ఎమ్మెల్యే చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గద్వాలలో అరుణ కుటుంబపాలన కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తుందని అన్నారు.
వేసవి వచ్చిందంటే చాలు విద్యార్థులు వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. ఈత నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఈత నేర్చుకునే వారు సహాయకులు లేకుండా వెళ్ళవద్దు
* బావుల్లో, కొలనులో నీటి లోతును గుర్తించి దిగడం మంచిది
* ఈత నేర్చుకుంటున్న పిల్లలు నడుముకు బెండ్లు, ట్యూబ్లు, తాళ్లు వంటివి కట్టుకోవాలి.
Sorry, no posts matched your criteria.