India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈమేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. BAHP, BSC ఫార్మాసేల్స్, మార్కెటింగ్, BCOM ఫైనాన్స్, BBA రీటెయిల్ ఆపరేషన్స్ వంటి ఒక్కో కోర్సుల్లో 60 సీట్ల ఉన్నాయన్నారు. ఎంవీఎస్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు జులై 7 వరకు గడువు ఉందన్నారు. సెకండియర్ పరీక్షలు జులై 31 నుంచి ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 9 నుంచి నిర్వహిస్తామని చెప్పారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. SDNR, ఆమనగల్లు, కొడంగల్ RR, VKB జిల్లాలోకి వెళ్లాయి. ప్రస్తుతం 16 మార్కెట్లు పనిచేస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఇలా అమలు కానున్నాయి. NGKL, మక్తల్ (BC మహిళ), అచ్చంపేట(SC), కొల్లాపూర్(ST), KLKY, దేవరకద్ర (BC మహిళ), MBNR, WNP, పెబ్బేరు, GDL, ALP, నవాబ్ పేట(BC), అత్మకూర్, బాదేపల్లి(OC జనరల్), మదనాపురం, NRPT, కోస్గి(SC)లకు కేటాయించారు.
√NGKL: త్రాగిన మైకంలో భర్తను చంపిన భార్య.
√MBNR:జడ్చర్లలో వ్యక్తి హత్య..
√ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలు.
√ రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
√ ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా ఏరువాక సంబరాలు.
√ రైతు రుణమాఫీ ప్రకటన పై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
√NGKL: చెంచు మహిళను పరామర్శించిన మాజీ మంత్రి సబితా, బర్రెలక్క.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో తనను కట్టుకున్న భర్తనే రోకలిబండతో కడతేర్చిన ఘటన తెలకపల్లి మండలంలో వెలుగు చూసింది. స్థానిక ఎస్సై బి.నరేష్ వివరాల ప్రకారం.. బెల్లె శ్రీను మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడుతూ ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపారు. మద్యం సేవించి గొడవపడగా రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో మృత్తి చెందారని తెలిపారు. కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
పంట రుణమాఫీ, రైతుభరోసాకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలోపు రుణం ఉన్న రైతులందరికీ ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి పాలమూరులో 5.49 లక్షల రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్కర్నూలు జిల్లా ఉరుకొండలో 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా జాలాపూర్లో 19.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 17.8 మి.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 9.8 మి.మీ, నారాయణపేట జిల్లా కోస్గిలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక MB మెడికల్ సెంటర్ వద్ద ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ అసిస్టెంట్ సమానస్థాయి ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్టీజోన్-2లో శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ బదిలీల కోసం తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించి శనివారం ఉదయం వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి కాగానే ఆన్లైన్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
జడ్చర్ల మండలం మర్రిచెట్టు తాండ గ్రామపంచాయతీ పరిధిలోని చౌటగడ్డ తండాలో ఓ ఇంటికి రూ.1.33 లక్షల కరెంటు బిల్లు రావడంతో ఇంటి యజమాని కంగుతిన్నాడు. తండాలో ఈనెల 11న విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లు ఇచ్చారని యజమాని మూడవత్ లింగ్యా నాయక్ తెలిపారు. 32 రోజులకు 103 యూనిట్ల కరెంటు వినియోగించానని, ఈ విషయంపై శుక్రవారం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి ఫిర్యాదు చేయగా.. విద్యుత్ అధికారులు బిల్లును మాఫీ చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.