India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా పరిమితికి మించి రూ.50వేల నగదు, బంగారు, ఇతర ఆభరణాలు తరలిస్తే ఆధారాలు వెంట ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. జడ్పీ సీఈవో బి. రాఘవేంద్రరావు, జిల్లా ఆడిట్ అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి బి.పద్మ, కోశాగార ఉప సంచాలకుడు బి.శ్రీనివాస్ లతో జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహబూబ్ నగర్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC(ఎస్టీజీ, ఎస్ఏ) పరీక్షపై అందించే ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 తుది గడువు అని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న అన్నారు.MBNR,NGKL,NRPT జిల్లాలకు చెందిన బీసీ నిరుద్యోగ అభ్యర్థులు నిర్దేశిత వెబ్ సైడ్ www.tsbcstudycircle.cgg.inలో దరఖాస్తులు చేసుకోవాలని, మిగతా వివరాలకు MBNR పట్టణం మెట్టుగడ్డలోని స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.
MBNR ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. SI విజయ్ భాస్కర్ వివరాలు.. భూత్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన చెన్నయ్య నాగమ్మను కడియాలు ఇవ్వాలని తల్లి రాజమ్మ పట్టుబట్టింది. మనస్తాపంతో నాగమ్మ ఈనెల 14న పురుగు మందు తాగగా భర్త చెన్నయ్య జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈనెల 20న అత్తను ఆస్పత్రిలో ఉంచి ఇంటికి వెళ్లిన భర్తకు నీ భార్య చనిపోయిందని రాత్రి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.
ఉమ్మడి MBNR జిల్లాలో గృహజ్యోతి పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రమంతట గృహ జ్యోతి అమలు అవుతుండగా కేవలం MBNR జిల్లాలో మాత్రమే అమలు కాకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. CM రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 27న గృహ జ్యోతి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 26న ఉమ్మడి జిల్లాలో MLC కోడ్ రావడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో కోడ్ ముగిశాకే గృహజ్యోతి అమలు కానుంది.
మహబూబ్ నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 తుది గడువు అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వెంటనే నిర్దేశిత వెబ్ సైట్ www.tswreis.ac.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇటు పార్లమెంట్.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఒకవైపు ప్రచార ఆర్భాటాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు చేరికల తతంగం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇక మరికొంతమంది మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
గిరిజన గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు నిర్దేశిత వెబ్ సైడ్ http:///tgtwgu-rukulam.telangana.gov.in ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఈనెల 28న జరగనున్న MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. ఉపఎన్నికకు సంబంధించి నోడల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ARO, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 23, 26న శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీ పాలన పోయిందని, ప్రజా పాలన వచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు.
Sorry, no posts matched your criteria.