Mahbubnagar

News March 21, 2024

నాగర్ కర్నూల్ MP టిక్కెట్టు మల్లు రవి కేనా..?

image

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జనభర్జన పడ్డ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు అభ్యర్థి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతుంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా, చివరకు ఎంపీ టికెట్టు మల్లు రవికి దక్కినట్లు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో బుధవారం విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.

News March 20, 2024

‘పాలమూరుకు మోదీ వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపు’

image

నరేంద్ర మోదీ వచ్చిన పాలమూరులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పార్లమెంటరీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్నగర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. డీకే అరుణ తరఫున ప్రచారానికి నరేంద్ర మోడీ వచ్చినా గెలుపు మాత్రం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆమె ఓటమి తప్పదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News March 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✔కొత్తూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
✔MBNR:కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ ఛైర్‌పర్సన్,పలు నేతలు
✔నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✔MBNR:BJPలో చేరిన పలువురు నేతలు
✔GDWL:MRO ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
✔కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి జూపల్లి
✔NGKL: చేపల వేట.. రెండు గ్రామాల మధ్య గొడవ
✔ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ పథకంపై అధికారుల ఫోకస్

News March 20, 2024

పరద: అనుమానాస్పదంగా యువకుడి మృతి.. కేసు నమోదు

image

అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన పదర మండలం వంకేశ్వరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్కచేను స్వామి(26) మంగళవారం రాత్రి తమ సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్రాబాద్ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు.

News March 20, 2024

BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రాజకీయ ప్రస్థానం

image

>1996లో టీడీపీ తరఫున MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
>2004లో సమాజ్ వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2009, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2018లో గద్వాల ఎమ్మెల్యేగా ఓటమి
>2019లో బీజేపీలో చేరి MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
కీలక పదవులు:
>కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సంబంధాలు, సమాచార శాఖ, చిన్న తరహా, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు
>ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా..

News March 20, 2024

కొత్తూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కిష్టయ్య, వెంకటేశ్‌గా గుర్తించారు.

News March 20, 2024

పేట బిడ్డకు రిలే పరుగులో గోల్డ్ మెడల్

image

నారాయణపేట జిల్లాకు చెందిన రవి కుమార్ 4/400 మీటర్ల రిలే పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. చండీగఢ్‌లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన రవిని అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మిత్రులు అభినందించారు.

News March 20, 2024

MBNR: కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ ఛైర్‌పర్సన్

image

MBNR: BRS నుంచి ఆ పార్టీ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సమక్షంలో బుధవారం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

News March 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔పకడ్బందీగా ఎన్నికల కోడ్..పలుచోట్ల తనిఖీలు
✔పోలింగ్ కేంద్రాలపై అధికారుల దృష్టి
✔GDWL:పలు మండలాలలో కరెంట్ కట్
✔MBNR:నేడు కాంగ్రెస్ లో చేరనున్న జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ,పలు నేతలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక MLAల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ):6:35,సహార్(గురు)-5:00
✔ఓటు హక్కు పై పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔త్రాగునీటిపై హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు
✔ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా

News March 20, 2024

MBNR: ఐదుగురిలో మిగిలేది ఒక్కరే!

image

ఉమ్మడి పాలమూరులో ఉన్న ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో BRS పార్టీకి ఇక ఒక్కరే మిగలనున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ముగ్గురు పార్టీలు మారగా, MBNR జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శాంత కుమారి ఒక్కరే BRS తమకు పదవులు ఇచ్చిందని, పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.