India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యుల్ కులాల బాల, బాలికలకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. ఇందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు రూ.200లు చెల్లించి ఆన్ లైన్ లో www.tgswreis. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
♥సర్వం సిద్ధం.. నేడే బక్రీద్ పండుగ
♥రాజోలి:నేటి నుంచి వైకుంఠ నారాయణస్వామి ఉత్సవాలు
♥పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎంపీలు,ఎమ్మెల్యేలు
♥గండీడ్:నూతన బస్సు సౌకర్యం.. ప్రారంభించనున్న నేతలు
♥త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక ఫోకస్
♥అక్రమ ఇసుక తరలింపు పై అధికారుల నిఘా
♥ఉమ్మడి జిల్లాలో.. NMMSకు 257 మంది ఎంపిక
♥ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నూతన అడ్మిషన్లపై అధికారుల నజర్
రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీ గంతలో పడి చనిపోయాడు. MBNR జిల్లా రాజాపూర్కు చెందిన శివ, లావణ్య దంపతుల కొడుకు జశ్వంత్(2) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి సమీప PHC వెనుక ఉన్న డ్రైనేజీ గుంతలో పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు జడ్చర్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబు అప్పటికే చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. బాలుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు మండిపడుతున్నారు.
HYDలోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గలవారు http://tsstudycircle.co.in లో ఈనెల 17 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT..
వానగట్టు వక్స్-ఎ-రహమానియా ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు జామా మసీదు నాయబ్ ఇమాం సయ్యద్ ముజాహెద్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జామా మసీదు నుంచి ప్రదర్శనగా వేలాది మంది ముస్లింలు వానగట్టు ఈద్గా మైదానానికి చేరుకుంటారు. ఈ ర్యాలీ ఆకుల చౌరస్తా, గడియారం, పాత బస్టాండు, కలెక్టర్ బంగ్లా చౌరస్తా, బోయపల్లి గేట్ మీదుగా వానగట్టు ఈద్గాను చేరుకుని 8.30 గంకు నమాజు నిర్వహిస్తారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్-NMMS ప్రతిభా పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. 2023-24 ఏడాదికి మొత్తం 620 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 257 మంది ఎంపికయ్యారు. ఇందులో MBNR జిల్లా నుంచి అధికంగా ఉన్నారు. దీంతో 5 జిల్లాల పరిధిలోని 257 మందికి 4ఏళ్లలో రూ.1.23 కోట్లు స్కాలర్షిప్ రూపంలో అందనున్నాయి. ఇవి వారి స్టడీకి ఎంతగానో ఉపయోగపడనుండగా, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది.
విద్యార్థినీలు తాము ఎంచుకున్న వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొని కష్టపడి చదవాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర అన్నారు. ఆదివారం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ, మైనార్టీ బాలికల విద్యాలయం, అర్బన్ జూనియర్ కళాశాలను సందర్శించారు. కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించాలని, ఆసక్తి ఉన్న రంగంలో రాణించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం వంట గదిని పరిశీలించి, మెనూ తెలుసుకున్నారు.
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య, రాగాయిపల్లి చెందిన గిరి ఇద్దరూ కలిసి బైక్ పై ఆమనగల్లు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాడుగుల రోడ్డులో 2 బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి . అయితే రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.