India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్: సార్వత్రిక విద్య (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు వచ్చే నెల 25 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ తెలిపారు. ప్రతి రోజు రెండు పూటలు పరీక్షలు ఉంటాయని ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 నుంచి 10 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
*ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేళ.. పటిష్ట పోలీస్ బందోబస్తు
*DSCకి ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
*మాజీమంత్రి శ్రీనివాస్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం:DK అరుణ
*ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ప్రశాంతంగా పది పరీక్ష
*కొనసాగుతున్న కుష్టువ్యాధి సర్వే
*NGKL:CM,MLA,MLC చిత్రపటానికి పాలాభిషేకం
*GDWL:పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
*WNPT:రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
MBNR:BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిఎస్సీ పరీక్షలకు 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న సోమవారం అన్నారు. MBNR, NGKL,NRPT జిల్లాలకు చెందిన అర్హత గల బిసి అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైడ్ లో(SGTకి ఈనెల 22న, SAకి ఏప్రిల్ 5వరకు) దరఖాస్తులు చేసుకోవాలని, ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్ లేదా స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.
పాలమూరు జిల్లాలో కుష్టువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి పట్టణాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు జిల్లాలో ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో స్పర్శలేని ఎర్రని రాగి రంగు, గోధుమ రంగు మచ్చలు పరిశీలించడం, కాళ్లు, చేతులు మొద్దుబారడం వాటిని పరిశీలిస్తారని, సిబ్బందికి సహకరించాలని ప్రజలకు DMHO కృష్ణ సూచించారు.
మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. MBNR-245, NRPT-205, కొడంగల్-56,WNPT-218, GDWL-225, NGKL-101, కొల్లాపూర్-67, అచ్చంపేట-79, కల్వకుర్తి-72, షాద్ నగర్-171 ఓటర్లు ఉన్నారు. 83 ZPTCలు, 888 MPTCలు, 449 వార్డు కౌన్సిలర్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 19 ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేయనున్నారు.
గద్వాల జిల్లా మానవపాడు మండలం చిన్న పోతులపాడుకి చెందిన ప్రవీణ్, మధు అనే టెన్త్ విద్యార్థులు ఉదయం పరీక్ష రాసేందుకు బైక్ పై స్వగ్రామం నుంచి మానవపాడులోని పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా మానవపాడు శివారులో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అటుగా వెళుతున్న ప్రయాణికులు గ్రహించి మానవపాడు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి కర్నూలుకు తరలించారు. దీంతో వారు తొలిరోజు పరీక్ష తప్పారు.
నల్లమలలోని అమ్రాబాద్ అభయారణ్యం 2,163 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. అడవిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఉమామహేశ్వర ఆలయాన్ని, మల్లెల తీర్థాన్ని పర్యాటక శాఖ కొంత అభివృద్ధి చేయగా.. వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూలను అటవీ శాఖ అభివృద్ధిలోకి తెచ్చింది.
ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి నాగర్కర్నూల్ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.
✔అంతా సిద్ధం..నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్.. తనిఖీలు షురూ
✔NRPT:నేటి నుంచి యోగ శిబిరం ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట ప్రారంభం
✔కొనసాగుతున్న కుష్టి వ్యాధుల సర్వే
✔MLC ఉప ఎన్నికలు..నేతలు బిజీ..బిజీ..
✔ప్రత్యేక చెక్ పోస్టులపై అధికారుల నిఘా
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ):6:34,సహార్(మంగళ):5:02
✔త్రాగునీటి సమస్యలపై సమీక్ష
Sorry, no posts matched your criteria.