Mahbubnagar

News March 18, 2024

MBNR: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

image

నిన్న మొన్నటి వరకు ఎండల వేడి నీతో ఇబ్బందులు పడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సోమవారం కాస్త ఉపశమనం లభించింది. నిన్నటి వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం కూల్‌గా ఉంది.

News March 18, 2024

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటర్లు 1,439

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది స్త్రీలు ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యంతరాల స్వీకరణ, మార్పుల తర్వాత ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News March 18, 2024

MBNR: PUలో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలు

image

పీయూ ప్రాంగణంలో కొత్తగా న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. న్యాయ కళాశాలలో మూడేళ్ల పాటు 60 సీట్లు, LLMలో 20 సీట్లు, ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తో పాటు నాలుగు కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలలు నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 18, 2024

NGKL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

బిజినేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వీపనగండ్ల మండల వాసి బాలకృష్ణ HYD వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మరో బైక్‌పై సూర్యాపేట జిల్లాకు చెందిన అజయ్‌, సిద్దార్థ్‌, భరత్‌ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో సిద్దార్థ్‌ అక్కడిక్కడే మృతిచెందగా గాయపడ్డ మరో ముగ్గురిని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

News March 18, 2024

పదో తరగతి పరీక్షలు.. సందేహాలు ఉంటే ఫోన్ చేయండి !

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా.. చరవాణి నం. 7702775340కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని, 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

News March 18, 2024

నేటి నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట నిర్వహించాలంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి మే 31 వరకు అమలుచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వీటిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ తిరిగి పిల్లల ప్రీ స్కూల్ రీ-అడ్మిషన్, బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుంది.

News March 18, 2024

MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీకా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. MBNR జిల్లాలో 59 సెంటర్లలో 12,866 మంది విద్యార్థులు, వనపర్తిలో 6,969 మంది, నాగర్ కర్నూల్‌లో 59 కేంద్రాల్లో 10,526 మంది, గద్వాలలో 7203 మంది పరీక్షలు రాయనున్నారు.

News March 18, 2024

HYDకు క్యూ కట్టిన పాలమూరు నిరుద్యోగులు

image

MBNR:గ్రూప్-1,DSC నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నిరుద్యోగులు హైదరాబాద్ కు క్యూ కట్టారు. అమీర్ పేట, అశోక్ నగర్, దిల్ సుఖ నగర్ కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. నిరుద్యోగులు రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు.MBNR జిల్లా కేంద్రంలోని అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.

News March 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

*ఏర్పాట్లు పూర్తి..రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
*WNPT:విద్యుదాఘాతంతో ఒకరి మృతి
*ఉమ్మడి పాలమూరు నుంచి ముగ్గురికి కార్పొరేషన్ పదవులు
*కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లాలో ‘BRS’ నేతల ధర్నా
*టెన్త్ ‘విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు’:DEOలు
*NGKL:రెండు బైకులు ఢీ..ఒకరు మృతి
*బీజేపీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలి:డీకే అరుణ
*MBNR,దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

News March 17, 2024

నాగర్ కర్నూల్: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కోటాలగడ్డ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్ధానికులు వివరాల ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు స్ధానికులు తెలిపారు. ఈ ఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.