India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒అచ్చంపేట మున్సిపాలిటీని కోల్పోయిన BRS
✒ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ
✒గద్వాల్:14న ఉద్యోగ మేళా
✒విద్యా,వైద్య రంగానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే పర్ణిక
✒APలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం.. ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్స్ సంబరాలు
✒పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి:సిపిఐ
✒ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల సందడి
✒ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై ఫోకస్
అచ్చంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ నరసింహ గౌడ్ పై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన తన పదవిని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది. కాగా త్వరలో కొత్త ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
నాగర్ కర్నూల్లో ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మేనేజర్ ఫోన్కి వారం క్రితం మెసేజ్గా వచ్చిన లింక్ ఓపెన్ చేయగా ఫోన్ హ్యాక్ చేశారు. బాధితుడి ఫోటోను న్యూడ్గా మార్ఫింగ్ చేసి బెదిరించి రూ.1.56 లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు SI గోవర్దన్ తెలిపారు.
MBNR జిల్లా కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ నేతల్లో అధికార పదవులకు పోటీ నెలకొంది. లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ పదవులు ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే.
పాలమూరులో వానాకాలం సీజన్ జోరందుకుంది. జూన్ 1 నుంచి ఉమ్మడి MBNR జిల్లాలో 60-80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 15-30 సె.మీటర్లు తడవడంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి, మొక్కజొన్న, జొన్న, మినము వంటి పంటలపై దృష్టి పెడుతున్నారు. రైతులు పత్తిపై మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్ పాలమూరులో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో. ✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి. )✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. ✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో. ✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి. ✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది. SHARE IT..
ఉమ్మడి జిల్లాలో 6,491 చెరువులు ఉన్నాయి. ఆయకట్టు కలిగిన చెరువులు 672, 100ఎకరాలకు లోబడి ఆయకట్టు కలిగిన చెరువులు, కుంటలు 5,819ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే చాలా చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టకపోవటమే దీనికి కారణం. గతేడాది వర్షాలకు కట్టలు కుంగి దెబ్బతిన్నాయి. తూముల్లో మట్టి, మొక్కలు మొలిచాయి. చెరువులను ఇటు నీటి పారుదల శాఖ, అటు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఆరేళ్లుగా పూర్తిగా కొరవడింది.
సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ఏఎస్ఐ మాట్లాడుతున్నానని తనకు డబ్బు కావాలని ఈనెల 4న పెట్రోల్ బంకు యజమానికి ఫోన్ చేశాడు. తాను అందుబాటులో లేనని మేనేజర్ గోపి నెంబర్ ఇచ్చాడు. గోపి ఆ వ్యక్తికి రూ.80 వేలు బదిలీ చేశాడు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
✓ నేడు పాఠశాలల పునః ప్రారంభం, విద్యార్థులకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు.
✓ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు మొదటి ర్యాంకు.
✓ దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు నేడు తుది గడువు.
✓ జోరందుకున్న వర్షం.. పొలం పనుల్లో నిమగ్నమైన కర్షకులు.
✓ ప్లాస్టిక్ రహితంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు చర్యలు.
✓ అద్వానంగా చెరువుల తూములు, కాలువలు, మరమ్మతులు చేపట్టకపోతే ప్రమాదమే.
కృష్ణ, జూరాల, తుంగభద్ర నదులకు వరద వస్తోంది. కర్ణాటకలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 4. 94 టీఎంసీల నీళ్లున్నాయి. 7211 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది. వరద నీరు ఆర్డీఎస్ మీదుగా మండలంలోని పులికల్ సమీపంలో ఉన్న నాగల దిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది. 2 నెలలుగా ఎండిన తుంగభద్రకు వరద రావడంతో నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు ఊరట చెందారు.
Sorry, no posts matched your criteria.