Mahbubnagar

News June 8, 2024

MBNR: పల్లెల్లో ‘కాంగ్రెస్’.. పట్టణాల్లో BJPకి జై !

image

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

News June 8, 2024

NGKL: ఆర్టీసీలో బదిలీల ప్రక్రియ ప్రారంభం

image

ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను బదిలీ చేస్తూ రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆదేశాలతో శుక్రవారం పీఓ ఉత్తర్వులు జారీ చేశారు. పేట5, గద్వాల3, NGKL 2, కోస్గి, వనపర్తి, కల్వకుర్తి, షాద్నగర్ డిపోల నుంచి ఒక్కొక్కరు చొప్పున 14మంది డ్రైవర్లు, పేట 4, గద్వాల 3, కల్వకుర్తి 2, కొల్లాపూర్ 2, షాద్నగర్, వనపర్తి నుంచి ఒకరు చొప్పున 13మంది కండక్టర్లను ఇతర డిపోలకు కేటాయించారు.

News June 8, 2024

MBNR: జీరో బిల్.. 2.65 లక్షల మందికి లబ్ధి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్టకేలకు గృహజ్యోతి పథకం(జీరో బిల్లు) అమల్లోకి వచ్చింది. గత మార్చిలోనే గృహజ్యోతి పథకం అమలు కావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల కోడ్‌తో పథకం అమలు నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు 3 నెలలపాటు విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. అధికారులు 2 రోజుల నుంచి జీరో బిల్లులను జారీ చేస్తున్నారు. జిల్లాలో 2.65లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.

News June 8, 2024

NGKL: ఆర్టీసీలో బదిలీల ప్రక్రియ ప్రారంభం

image

ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను బదిలీ చేస్తూ రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆదేశాలతో శుక్రవారం పీఓ ఉత్తర్వులు జారీ చేశారు. పేట5, గద్వాల3, NGKL 2, కోస్గి, వనపర్తి, కల్వకుర్తి, షాద్నగర్ డిపోల నుంచి ఒక్కొక్కరు చొప్పున 14మంది డ్రైవర్లు, పేట 4, గద్వాల 3, కల్వకుర్తి 2, కొల్లాపూర్ 2, షాద్నగర్, వనపర్తి నుంచి ఒకరు చొప్పున 13మంది కండక్టర్లను ఇతర డిపోలకు కేటాయించారు.

News June 8, 2024

PU పరిధిలో దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలో దోస్త్ ద్వారా చేపడుతున్న అడ్మిషన్లకు సంబంధించి మొదటి దశ సీట్ల కేటాయింపు జరిగింది. ఇందులో పీయూ పరిధిలో మొత్తం 92 కళాశాలలో 31,300 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి విడతలో 4,499 సీట్లను కేటాయించారు. బీఏలో 1,003, బీకాంలో 1,227, బీఎస్సీలో 2,146 ఇతర గ్రూపులో 123 మంది విద్యార్థులు ఉన్నారు.

News June 8, 2024

ధరూర్: జూరాలకు 1,588 క్యూసెక్కుల ఇన్ ప్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం 1,588 క్యూసెక్కుల ఇన్ ప్లో నమోదైందని పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ ప్లో స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో నీటిమట్టం కాస్త పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టులో 4.027 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి 141 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.

News June 8, 2024

గ్రూప్-1 పరీక్ష.. వేలిముద్ర వేయాల్సిందే !

image

గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు కేంద్రంలోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు కేంద్రాలను తనిఖీ చేయనున్నారని, తనిఖీలకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, ముఖ్యంగా అభ్యర్థులు కాళ్లకు షూ ధరించరాదు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలి. సీఎస్‌కు మాత్రమే ఫోన్ అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

News June 8, 2024

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి రికార్డ్

image

రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో నాగర్‌కర్నూల్ నుంచి నుంచి ప్రాతినిధ్యం వహించనున్న మల్లు రవి(73) పెద్ద వయస్కుడిగా రికార్డుకు ఎక్కారు. కాగా మల్లు రవి ఎంబీబీఎస్ చదివారు. 1980లో ఉమ్మడి APలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ డాక్టర్స్ వింగ్ కన్వీనర్‌గా ఆయన పనిచేశారు. 1991లో తొలిసారిగా NGKL ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో రెండోసారి MPగా గెలిచిన ఆయన 26ఏళ్ల తర్వాత మళ్లీ పార్లమెంట్‌కు వెళ్తున్నారు.

News June 8, 2024

గద్వాల: పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్: ఎస్పీ రీతిరాజ్

image

ఈనెల 8న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 6 :00 నుంచి మధ్యాహ్నం 1: 00 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ రితిరాజ్ శుక్రవారం పేర్కొన్నారు. మొత్తం 105 మంది పోలీస్ సిబ్బంది 14 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు.

News June 7, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి”CRIME NEWS”

image

✓దౌల్తాబాద్:పిడుగుపాటుకు యువకుడు మృతి.
✓ గద్వాల: ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ఒకరు మృతి.
✓ మహబూబ్నగర్: భారీ అగ్ని ప్రమాదం.
✓ గద్వాల్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.
✓ నాగర్ కర్నూల్: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి.
✓ కడ్తాల్: జంట హత్య కేసులో ఏడుగురి అరెస్ట్.
✓ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు గురై మూగజీవాలు మృతి.
✓ కొల్లాపూర్: ఎక్సైజ్ అధికారుల దాడులు కేసు నమోదు.

error: Content is protected !!