India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రహదారి-44పై అలంపూర్ చౌరస్తా సమీపంలో కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లే దారిలో గురు నానక్ డాబా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ రాం బహదూర్, మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గురుగావ్ నుంచి కర్ణాటకలోని కోచ్ కోడ్ కు కొరియర్ సరుకులతో కంటైనర్ వెళ్తున్నట్లు సమాచారం. కంటైనర్ రోడ్డుపై పూర్తిగా అడ్డంగా పడడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాంమైంది.
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా రేపటి నుంచి 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40-50 Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాలమూరు వాసులారా జాగ్రత్తగా ఉండండి.
✒MBNR: ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం.. సంబరాల్లో నేతలు
✒దామరగిద్ద: బావిలో పడి యువకుడి మృతి
✒జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు:KCR
✒బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు : మంత్రి జూపల్లి
✒వనపర్తి:ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్పై దాడి
✒నాగర్కర్నూల్లో గర్భిణి మృతి.. బంధువుల ధర్నా
✒ఉమ్మడి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
✒షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం
✒పలుచోట్ల ‘సోనియా గాంధీ’ చిత్రపటానికి పాలాభిషేకం
నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం కానుకుర్తి నిరంజన్ స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బాబమ్మ, సామలప్ప దంపతుల రెండో కుమారుడు నిరంజన్(చింటు) మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అందులో మునిగి నిరంజన్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్బంగా ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జిల్లా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చం అందజేసి శుభాకంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.
జూన్ 4 తరువాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు. అయినా తమ అభ్యర్థి ఓడింది కేవలం 111 ఓట్లతోనే అని అన్నారు. స్థానిక సంస్థల్లో గతంలో 300 ఓట్లున్న కాంగ్రెస్ బలం 652 ఓట్లకు పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ రెడ్డి దంపతులు, ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నవీన్ రెడ్డిని అభినందిస్తూ పూలబోకే అందజేశారు. నవీన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన ఉమ్మడి జిల్లా నేతలను కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, ఎలక్షన్ ఏజెంట్లతో ఆదివారం కన్వెన్షన్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంగళవారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి చివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పూలమాలలతో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం, అధికారులు, తదితరులు ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1437 ఓట్లు పోలయ్యాయి. జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ నుంచి నవీన్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్రెడ్డి పోటీ చేశారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.