Mahbubnagar

News May 31, 2024

కొత్తకోట: లారీ ఢీకొన్న డీసీఎం క్లీనర్ మృతి

image

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం NH-44పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని డీసీఎం డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో డీసీఎం క్లీనర్ సూర్య నాయక్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరూక్ నగర్ మండలం వెంకన్నగూడకు చెందిన సూర్య డిసిఎం క్లీనర్. కోళ్ల ఎరువు లోడ్‌తో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 31, 2024

గద్వాల: లింక్ క్లిక్ చేసినందుకు రూ.2.58 లక్షలు స్వాహా !

image

రాజోలికి చెందిన ఎల్లప్ప తన ఫోన్‌కు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ అంటూ వచ్చిన లింక్‌ను క్లిక్ చేశాడు. దీంతో ఆయనకు సంబంధించిన 3 క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజులు వచ్చాయి. అలా మొత్తం రూ.2.58 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో ఆందోళనకు గురైన ఎల్లప్ప సైబర్ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం స్థానిక ఎస్సై జగదీశ్వర్‌ని కలిసి విషయాన్ని చెప్పారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని SI సూచించారు.

News May 31, 2024

రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: BRS

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని BRS ఆఫీసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను 10ఏళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కృషి చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News May 31, 2024

MBNR: జూన్ 3 నుంచి బడి బాట.. వారే టార్గెట్

image

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వచ్చే నెల 3వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ‘బడి బాట’ కార్యక్రమం చేపట్టనుంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ఉండనుంది. MBNR జిల్లాలో 859, NRPTలో 511, NGKLలో 848, గద్వాలలో 472, వనపర్తిలో 523 పాఠశాలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,213 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది.

News May 31, 2024

GHPU యూనివర్సిటీ జేడీగా కల్వకుర్తి వాసి

image

కల్వకుర్తికి చెందిన సామాజికవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్ ఆరిపుదిన్ GHPU యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత పది సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ రైట్స్, ఆర్టిఐ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు.

News May 31, 2024

MBNR: మళ్లీ భానుడి భగభగలు.. 

image

రోహిణి కార్తీ‌లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 రోజులుగా వాతావరణం కూల్‌గా ఉండగా గత మూడు రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. వారం రోజుల క్రితం పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉన్నాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 31, 2024

MBNR: మళ్లీ భానుడి భగభగలు.. 

image

రోహిణి కార్తీ‌లో రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయని వృద్ధులు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 రోజుల పాటు వాతావరణం కూల్‌గా ఉండగా గత మూడు రోజులు మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజుల క్రితం పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే ఉన్నాయి. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

News May 31, 2024

బాలానగర్: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని ఈదమ్మగడ్డ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజమ్మ (41) ఆమె భర్త శంకర్‌తో పాటు ఇద్దరు కుమారులు ఆస్తి పంపకం విషయంలో తరచూ గొడవపడేవారు. తల్లిని కుమారులు తిట్టడంతో బుధవారం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. MBNR ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేశారు.

News May 31, 2024

MBNR: తక్కువ ధరకే బంగారం పేరుతో.. మోసం

image

తక్కువ ధరకే బంగారం అంటూ ఓ వ్యక్తి మోసపోయిన ఘటన MBNR జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన శంకర్ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. శంషాబాద్‌కు చెందిన మధుతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తన వద్ద 12 తులాల బంగారం ఉందని, డబ్బులు అవసరముందని ఈనెల 29న ఫోన్ చేసి రూ.2 లక్షలకు బంగారం అమ్మాడు. అనుమానంతో తనిఖీ చేయించగా బిస్కెట్ బంగారంగా తేలింది. గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 31, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

జూన్ 4న జరిగే మహబూబ్ నగర్ లోక్ సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైటింగ్, భారీకేడ్లు, పార్కింగ్ ఏర్పాట్లపై సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.

error: Content is protected !!