India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాలివాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
NGKL జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. స్థానికుల కథనం.. వేణుగోపాల్(35) కారు డ్రైవర్. యాత్రికులను తీసుకొని శ్రీశైలం వెళ్లి తిరుగు వస్తున్నారు. ఈ క్రమంలో NGKL సమీపంలో మంతటి వద్ద రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి కారుపై పడింది. దీంతో కారు అద్దం పగిలి గుచ్చుకొని వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.
పాలమూరులో ZPTC, MPTC సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండగ కొనసాగనుంది. ఆయా ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు.
గాలి వాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో పిడుగుపాటుతో గోపాల్ రెడ్డి(45) చనిపోగా నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
మహబూబ్నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతాయని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. లేకపోతే పరీక్షలకు అనుమతి ఉండదని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి పంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామ శివారులో జరిగింది. APలోని కర్నూలు జిల్లా గుంతలపాడుకు చెందిన చంద్రశేఖర్(30) బైక్ పై టీ. గార్లపాడు మీదుగా వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో యువకుడికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం
* తాగునీటి సౌకర్యాలు కల్పించడం
* పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం&నిర్వహణ
* విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం
* బాలికల మరుగుదొడ్ల నిర్మాణం
* పాఠశాలలో సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. BRS, BJP మినహా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. NGKL ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో, MBNR ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా మల్లాపూర్లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో 39.8, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 39.7, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 38.4, వనపర్తి జిల్లా దగడలో 37.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.