Mahbubnagar

News May 26, 2024

MBNR: రైల్వే స్టేషన్ వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త!

image

మీరు మీ కుటుంబ సభ్యులను, బంధువులను రైల్వేస్టేషన్‌లో దించడానికి వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త! రైల్వే పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి మీ బైక్ దిగేలోపే.. రాంగ్ పార్కింగ్ చేశారని బైక్‌ను స్వాధీనం చేసుకొని జరిమానా కట్టాలని గంటల తరబడి ఓ గదిలో ఉంచుతారు. తర్వాత రైల్వే జడ్జి ముందు ప్రవేశపెట్టి జరిమానా విధిస్తారు. ఇప్పటికి 82 మందిపై కేసులను నమోదు చేసి రూ.45,500 జరిమానా వసూలు చేశారు. మరీ మీరు జాగ్రత్త..!

News May 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు నాగర్ కర్నూల్ 848 పాఠశాలల్లో 450 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణ పేట జిల్లాలో 493 పాఠశాలల్లో 470 ఉపాధ్యాయ ఖాళీలు, గద్వాల జిల్లాలో 461 పాఠశాలల్లో 317 ఖాళీలు, వనపర్తి జిల్లాల్లో 523 పాఠశాలల్లో 316 ఖాళీలు, MBNR జిల్లాలో 852 పాఠశాలల్లో.. 415 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి 1,968 పోస్టులు ఖాళీలు ఉండటంతో.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

MBNR: స్థానిక సమరానికి అధికారుల కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండో వారంలో వార్డుల రిజర్వేషన్లను, మూడో వారంలో గ్రామ పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లను ప్రకటించేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. షెడ్యూల్ విడుదల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

మహబూబ్‌నగర్ ఎంపీగా గెలవబోతున్నా: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎంపీగా గెలవబోతున్నానని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా చూపిస్తున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు పార్టీ శ్రేణులు డీకే అరుణను కలిశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ నినాదంతో ప్రజలు బీజేపీ వైపు ముగ్గు చూపారని ఈ సారి గెలుపు మనదే అని శ్రేణులు చెప్పారు.

News May 26, 2024

NRPT: ‘నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి’

image

జిల్లాలో నేరాల నియంత్రణకై పోలీసులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారానికి కోర్టు పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.

News May 25, 2024

MBNR: మూడు విడతల్లో ఇంటర్ మూల్యాంకనం

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ జరగనుందని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.

News May 25, 2024

కొలిక్కిరాని శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు !

image

పాలమూరులో సంచలనం సృష్టించిన BRS నేత శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి 56 గంటలు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. హత్యకు దారితీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తోన్నారు. కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

News May 25, 2024

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో గెలుపెవరిది..?

image

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత MBNR పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై కాంగ్రెస్, BJP, BRS పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ MLAలు ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలతో తమ గెలుపు ఖాయమని BJP నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో BRS నామమాత్రంగానే బరిలోకి దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

News May 25, 2024

వనపర్తి: బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

image

వనపర్తి జిల్లాలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం.. ఇద్దరు బైక్‌పై గొల్లపల్లి నుంచి ఆదిరాల వెళ్తుండగా ఏదుల గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

MBNR: పంట రుణాలపై సీఐడీ విచారణ !

image

రైతులు DCCB అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-19 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై CID అధికారులు విచారణ చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు DCCB నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను ఆడిట్ చేసే క్రమంలో చెల్లింపుల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!