India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిలీ విత్తనాల ఉత్పత్తి, విక్రయంపై ఫోకస్ పెట్టాలని గద్వాల ఎస్పీ రితిరాజ్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై నిఘా ఉంచి, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఆరా తీయాలని సూచించారు. బార్డర్ గ్రామాల్లో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు.
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో పరిధిలోని సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వెళ్లేవారికి DM సుజాత శుభవార్త తెలిపారు. జూన్ 1 నుంచి పైన పేర్కొన్న బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కావున ప్రయాణికులు తాము తీసుకున్న టికెట్ పై పేరు, ఫోన్ నంబర్ రాసి ఆర్టీసీ డ్రైవర్ వెనుకాల ఉన్న బాక్స్లో వేయాలన్నారు.
జూన్ 4న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా జాగ్రత్తగా నిర్వహించాలని AROలకు కలెక్టర్ రవినాయక్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై బుధవారం కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. నిర్దిష్ట సమయానికంటే ముందే లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
MBNR: నీటిపారుదల శాఖలో బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నీటిపారుదల శాఖలో అన్ని హోదాల్లో ఈనెల 31 వరకు 5 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయనున్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలను జూన్ 4వ తేదీ లోపు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
తలకొండపల్లి సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మండలంలోని కర్కస్ తండాకు చెందిన కృష్ణ నాయక్ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న కాంగ్రెస్ మల్లురవి ఘటన స్థలంలో ఆగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాలలోకి సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు షెడ్యూల్ సమయం కంటే ముందే కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 284 ముంది అతిథి అధ్యాపకులకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల వేతన బకాయిలు విడుదలయ్యాయని జిల్లా ఇంటర్ కార్యాలయ అధికారులు తెలిపారు. మూడు నెలల బకాయిల మొత్తం రూ.1,70,99,344 విడుదలయ్యాయని అన్నారు. వీరికి ప్రభుత్వం నెలకు 72 పీరియడ్లకు మించకుండా ప్రతి పీరియాడికి రూ.390 చొప్పున రూ.28,080 చెల్లిస్తోంది.
జులై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈమేరకు సెక్రటేరియట్లో అటవీ, పంచాయతీరాజ్, ఎండోమెంట్ అధికారులతో సమీక్షించారు. అమ్రాబాద్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, రిజర్వ్ పరిధిలోని 4 ప్రాంతాల్లో ప్రజల తరలింపు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా నవబ్ పేటలో 39.9 డిగ్రీలు నమోదైంది. గద్వాల జిల్లా అలంపూర్లో 39.1, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 38.8, వనపర్తి జిల్లా దగడలో 38.6, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 38.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని 25 బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 30లోగా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరాలని బీసీ గురుకులాల సమస్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. MJP బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు పాఠశాలలు కేటాయించారు. కావున ఎంపికైన వారు తమ ధ్రువ పత్రాలతో ఈనెల 30లోగా కేటాయించిన పాఠశాలలో చేరాలని కోరారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.