India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అకాల వర్షాలు, అనుకోకుండా వచ్చే ఈదురు గాలులు ఉమ్మడి జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పది రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షాల్లో పిడుగులు పడి రైతులు, రైతు కూలీలతో పాటు ఎన్నో మూగజీవాలు మృతి చెంది అనేక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను నేలమట్టం చేసి, పిడుగులు ఈదురుగాలులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి-167పై మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక <<13331578>>బస్సు, బైక్<<>> ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్(29), రాఘవేంద్రచారి(30) అక్కడికక్కడే మృతి చెందగా.. మహేష్(21) కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో MBNRకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
గండీడ్ మండలంలోని ఆశిరెడ్డిపల్లి శివారులో మంగళవారం ఉదయం చిరుత కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ శివారులో కోరాళ్లగుట్టపై నుంచి కిందకు వస్తున్న చిరుతను అక్కడే ఉన్న వెంకటయ్య చూసి వెంటనే సమీప పొలాల రైతులు, గ్రామస్థులకు సమాచారమిచ్చారు. నాలుగైదు రోజులుగా కొండాపూర్, రంగారెడ్డిపల్లి, లింగాయపల్లి శివారుల్లో చిరుత సంచరిస్తూ మేకలను చంపితినేస్తుంది. తాజాగా ఆశిరెడ్డిపల్లి అటవీలో కనిపించింది.
జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లేదా మరేదైనా సందేహాల నివృతి కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జూన్ 8 ఉ.10 నుంచి సా. 6 వరకు తిరిగి 9న ఉ. 6 నుంచి మ. 2 వరకు 08545-233525 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సందేహాలనివృత్తికి అభ్యర్థులు హెల్ప్లైన్ నంబరును వాడుకోవాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు మంగళవారం తెలిపారు. నేడు ఏసీబీ అధికారులు ఆర్టీవో కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముగ్గురు పట్టుబడ్డారు. ఎలాంటి అధికారం లేకున్నా అధికారులతో కుమ్మక్కై విధులు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. నీటిగుంతలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడ్డారు. చిన్నారుల అర్తనాదాలు విన్న స్థానికులు గుంత దగ్గరికి వెళ్లి ఒకరిని బయటికి తీయగా ఇద్దరు <<13332379>>చిన్నారులు<<>> మహమ్మద్ ఫుర్ఖాన్ (10) , మహమ్మద్ హుస్సేన్ (13) నీటమునిగి మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.
నాగర్కర్నల్ జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. వారి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా గట్టులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38.6, నారాయణపేట జిల్లా ఉట్కూర్లో 38.1, వనపర్తి జిల్లా దగడలో 37.7, నాగర్ కర్నూల్ జిల్లా జెట్ప్రోల్లో లో36.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
✓ పాఠశాల, కళాశాల బస్సు నడిపే డ్రైవరు వయసు 60 ఏళ్ల లోపుండాలి.
✓ అయిదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
✓ ప్రతి పాఠశాల బస్సుకు డ్రైవరుతో పాటు సహాయకుడిని (అటెండెంటు) నియమించుకోవాలి.
✓ బస్సుల్లోని కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసల పైపులను విద్యార్థులు తల బయటపెట్టి తొంగి చూడకుండా ఉండేలా అమర్చాలి.
✓ బస్సు కండీషన్లో ఉండటమే కాకుండా బ్రేకు వేసిన సమయంలో నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు వెలగాలి.
MBNR లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డీకే అరుణ, వంశీ చంద్ రెడ్డి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
Sorry, no posts matched your criteria.