India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలి విడత కానుంది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. కాగా ఈసారి జిల్లాకు హరితహారం కింద 30.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.
మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని అపహరించిన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ తమ వాహనాలు పక్కకు నిలిపి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైయ్యాడు. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని పక్కకు పంపించారు. తర్వాత చూస్తే పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. కోదండపురం ఓ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం పోలీసులు గుర్తించారు.
1890 డిసెంబర్ 4రోజున పాలమూరులోని 6వ నిజాం మహబూబ్అలీ ఖాన్ పేరు మీదనే మహబూబ్ నగర్గా పేరు మార్చారు. మహబూబ్ నగర్ అంటే గుర్తు వచ్చేది” పిల్లల మర్రి”ఆ చెట్టు వయసు దాదాపు 800 సంవస్సరాలు, ఈ చెట్టు 4 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, పల్లెల హనుమంత రావు, లాంటి గొప్పవాళ్లు ఉమ్మడి MBNRకి చెందిన వాళ్ళు, జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర”కురుమూర్తి స్వామి”జాతర. SHARE IT
ఉమ్మడి జిల్లాలో పదేళ్లుగా కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరు కాలేదు. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా కార్డుల జారీ లేక ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు దక్కక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఊరట నిస్తోంది. గతం మాదిరి కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.
నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్ ఎస్ఈ ఎన్.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్బా బాలికల విద్యాలయం (KGBV) ఏర్పాటుచేసింది. ఇంటర్కు విద్య అందిస్తున్న KGBVల్లో MPC, BIPC, MEC, MHIW కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వస్తుండటంతో KGBVలకు ఆదరణ పెరుగుతోంది. MBNR, NGKL, WNP, GDL, NRPT జిల్లాల్లో ఉన్న నిరుపేద, అనాథ బాలికల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
విషం తాగి ఓ అధ్యాపకురాలు బలవన్మరణానికి పాల్పడింది. KPHB పోలీసుల వివరాల ప్రకారం.. MBNR కిషన్నగర్కు చెందిన ఉమాదేవి మియాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. KPHB సర్దార్ పటేల్ నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటుంది. ఈ నెల 24న విషరసాయనం ఆన్లైన్లో ఆర్డర్ చేసి తాగేసింది. గమనించిన వసతి గృహం నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
గాలివాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ద కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
గాలివాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
NGKL జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. స్థానికుల కథనం.. వేణుగోపాల్(35) కారు డ్రైవర్. యాత్రికులను తీసుకొని శ్రీశైలం వెళ్లి తిరుగు వస్తున్నారు. ఈ క్రమంలో NGKL సమీపంలో మంతటి వద్ద రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి కారుపై పడింది. దీంతో కారు అద్దం పగిలి గుచ్చుకొని వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.