India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్లు బంద్ కానున్నాయి. పోలింగ్ 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో మద్యం ప్రియులు నేడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
వంశీచంద్ రెడ్డి(INC) NGKL నుంచి పద్మావతి కాలనీ(MBNR)లోని 113 నంబర్ పోలింగ్ బూత్ కు,DK అరుణ(BJP)GDWL నుంచి టీచర్స్ కాలనీ(MBNR) బ్రిలియంట్ స్కూల్లో 113 పోలింగ్ బూతుకు, మల్లు రవి(INC) ఖైరతాబాద్ బూత్ నంబరు 157లో, మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) నవాబుపేట(మ) గురుకుంటలోని 22వ పోలింగ్ బూత్లో,RS ప్రవీణ్ కుమార్(BRS)సిర్పూర్ నుంచి అలంపూర్ బూత్ నంబర్ 272లో, భరత్ ప్రసాద్(BJP) చంపాపేట్(HYD)లో ఓటు వెయ్యనున్నారు.
✔’నేడు పెబ్బేరుకు ఉప ముఖ్యమంత్రి భట్టి రాక’
✔నేడు పాలమూరుకు బిజెపి బైక్ ర్యాలీ
✔నేడు వనపర్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
✔నేటితో ముగియనున్న ఎంపీ ఎన్నికల ప్రచారం
✔బాదేపల్లి మార్కెట్ నేడు బంద్
✔డబ్బు,మద్యం పంపిణీపై అధికారుల ఫోకస్
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔MP ఎన్నికల EFFECT..సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారలపై నిఘా
✔పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుపై అధికారుల దృష్టి
అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నారాయణపేటలో శుక్రవారం జరిగిన బీజేపీ జనసభ, బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ప్రధాని మొదటిసారిగా జిల్లాకు రావడంతో సర్వత్రా ఉత్సాహం వెల్లివిరిసింది. మోదీ ప్రసంగానికి యువత, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రధాని రాకకు ముందే ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. మోదీ ప్రసంగం ముగిసేంతవరకు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సా. 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పాలమూరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 31 మంది, నాగర్ కర్నూల్ పరిధిలో 19 మంది బరిలో ఉన్నారు. ఇన్ని రోజులుగా మైకులతో హోరెత్తిన పట్టణాలు, గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొననుంది.
అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
HYDకు వచ్చే పెట్టుబడులు గుజరాత్కు తరలించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నారాయణపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘RR అంటే ఎవరో నేను చెప్పలేదు.. కానీ సీఎం తమ పేర్లు చెప్పుకున్నాడు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రతకు గ్యారెంటీ. మోదీ గ్యారెంటీ అంటే అన్ని వర్గాల అభివృద్ధికి గ్యారెంటీ. రామ మందిరం కట్టడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
✏SDNR: కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు:CM రేవంత్రెడ్డి
✏పేద ప్రజలకు 3 కోట్ల ఇల్లు కట్టిస్తాం:PM మోదీ
✏NGKL:35 దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
✏ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
✏ఓటేసి మనమేంటో చూపిద్దాం.. అధికారుల పిలుపు
✏ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
✏ప్రజలకు మంచి చేయాలనే నా తపన: బర్రెలక్క
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
✏పానగల్: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి
Sorry, no posts matched your criteria.