India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యాదగిరి(మల్టీ జోన్ 2), మల్టీ జోన్ 1 డైరెక్టర్ జాయింట్ రాజేందర్ సింగ్, అలాగే తెలంగాణా డిగ్రీ పీజీ కళాశాలల ప్రిన్సిపల్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు దర్శనాలు చేయించారు. వీరితోపాటు డిగ్రీ కళాశాల లెక్చరర్ పిండి కృష్ణమూర్తి ఉన్నారు.
✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో.
✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్.
✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి.)
✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్.
✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో.
✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి.
✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది.
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారని స్థానికులు తెలిపారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా సోలిపూర్లో 41.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 36.5 మి.మీ, గద్వాల జిల్లా సాటేర్లలో 29.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో 22.0 మి.మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇంట్లో ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడ్డాకుల మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కుటుంబ సభ్యులు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనేందుకు వెళ్లగా యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని MBNR ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో గతంలో అప్పులు తీసుకున్న రైతులకు అప్పటి BRS ప్రభుత్వం తొలి విడతలో రూ.50వేలు రుణం ఉన్నవారికి, 2వ విడతలో రూ.99 వేల వరకు రుణం ఉన్నవారికి రుణమాఫీని వర్తింప చేసింది. పాత రుణం రద్దు చేసి వారికి తిరిగి కొత్త పంట రుణం మంజూరు చేశారు బ్యాంకర్లు. రుణమాఫీ వారికి మినహాయించి మిగతా వారికి ఇస్తారా లేక అందరికీ ఇస్తారా అనేది తేలియాలి. అందరికీ మాత్రం 2023లో రుణమాఫీ పొందిన రైతులకు డబుల్ ధమాకా తగలనుంది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లా నుంచి 6134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
CM రేవంత్ 5 నెలలు అవుతున్నా పాలనపై పట్టు సాధించకుండా.. హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు అని DK అరుణ ఆరోపించారు. MP ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు దక్కడం లేదన్న టెన్షన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. BJPకి రాష్ట్రంలో 10 నుంచి 12 MP స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో CM టెన్షన్లో ఉన్నారన్నారు.
వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 3,21,523 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 1,70,445 ఎకరాల్లో సాగు కానుండగా.. 42,612 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 85,379 ఎకరాల్లో సాగు కానుండగా.. 853.79 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల మైదానంలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వాములు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీలలో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా నుంచి పాల్గొంటారని తెలిపారు. అండర్ 18 బాలురు బాలికలు, క్రీడలలో పాల్గొంటారని వివరించారు.
Sorry, no posts matched your criteria.