India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బూత్ క్యాప్చరింగ్, ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం తదితర చర్యలకు పాల్పడితే ఐపిసి సెక్షన్ 135ఏ, 136 ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా విధించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చాలా వరకు నోటా వైపు వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు నోటాకు మద్దతు ఇచ్చారు. అత్యధికంగా అచ్చంపేట నియోజకవర్గంలో 2,833 మంది నోటాకు ఓటు వేశారు. అత్యల్పంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 661 మంది నోటాకు ఓటు వేశారు.
ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న MBNR, NGKLపార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపునకు మాత్రం BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈనెల11 వరకూ ప్రచారం ముగియనుండటంతో, ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రతి ఓటరును కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
గర్భంలో శిశువు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సుజాత (26) వీరేష్ దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సుజాత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. సోమవారం పురిటి నొప్పులు రావడంతో గట్టు PHCకి వెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సాధారణ ప్రసవం చేశారు. అయితే గర్భంలో మగ శిశువు మృతి చెందాడు.
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి చేసి హతమార్చిన సంఘటన బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI నాగశేఖర్ రెడ్డి వివరాలు.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, నాగయ్య భార్య భర్తలు. వీరు వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవారు. వీరిద్దరూ మద్యానికి బానిసయ్యారు. సోమవారం మధ్యాహ్నం కూలీ పనులకు వెళ్లి వచ్చి గొడవ పడ్డారు. భర్త నిద్రపోయాక నాగయ్య మెడపై భార్య గొడ్డలితో నరికింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
లోక్సభ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్ సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహించనుండగా, 11న సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. MBNR, NGKL నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యనేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో ఏ ఒక్క చిన్న తప్పు ఆస్కారం లేకుండా డ్యూటీ చేయాలని కలెక్టర్ బీఎన్ సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా ఏకశిలా పాఠశాలలో పీఓ, ఏపిఓ, ఓపిఓలకు పలుసూచనలు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతిలోనే ట్రైనింగ్ మాస్టర్లచే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.
✏NGKL:తెలకపల్లిలో వైద్యం వికటించి..వ్యక్తి మృతి
✏NRPT:అక్రమంగా తరలిస్తున్న 16,560 లీటర్ల మద్యం పట్టివేత
✏ఎర్రవల్లి:వాహనం ఢీకొని మహిళ మృతి
✏కల్వకుర్తి:MLA కసిరెడ్డి వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి
✏WNPT:BJPకి పలువురు రాజీనామా
✏ప్రారంభమైన డిగ్రీ అప్లికేషన్లు..PU పరిధిలో 29,740 సీట్లు
✏EVM పై సిబ్బందికి అవగాహన
✏అచ్చంపేట:మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నిరసన సెగ
✏ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి:TPUS
ప్రియుడితో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కడ్తాల్ మండలంలోని మక్త మాదారం గ్రామ సమీపంలోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్లో గత నెల 30న గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాదులోని నాదర్గూల్కు చెందిన తాండ్ర రవీందర్ (45)ను అతని భార్య గీత ప్రియుడు యాదగిరి అనే వ్యక్తితో హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన NGKL జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌరారం గ్రామానికి చెందిన చిన్న రాములు (38) అనారోగ్యం కావడంతో తెలకపల్లిలో ఓ ప్రైవేటు వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ వైద్యుడు టైఫాయిడ్ వచ్చిందని ఇంజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టాడు. ఆ వైద్యం వికటించి మరణించాడు. వైద్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.
Sorry, no posts matched your criteria.