India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో 4,004 పోలింగ్ కేంద్రాలకు గాను.. మొత్తం 15,876 మందిని ఎన్నికల విధుల కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు. MBNR లోక్సభ స్థానంలోని 1,937 పోలింగ్ కేంద్రాలకు 7,748 మంది, NGKL లోక్సభ స్థానంలోని 2,067 పోలింగ్ కేంద్రాలకు 8,128 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాన్ని సా.5 నుంచి 6 గంటల వరకు పెంచారు.
గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మనకు సెమీఫైనల్ లాంటివి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రవల్లి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆ ఎన్నికల్లో BRSను ఓడించి ఇంటికి పంపాము. వచ్చే పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్గా సాగుతోంది. ఆ మ్యాచ్లో గెలిచి మన సత్తా చాటుకోవాలి. BRS, BJPలు చీకటి ఒప్పందాలు చేసుకొని మనల్ని ఓడించాలని చూస్తున్నాయి’ అని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ CM KCRను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. ప్రతి గ్రామంలో అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో స్పీడ్ పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ రెండు స్థానాల్లో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలపై మోపింది.
♥అధికారంలోకి వస్తే కుల గణన చేస్తాం: రాహుల్ గాంధీ
♥MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్
♥ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ
♥9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ:CM రేవంత్ రెడ్డి
♥BJPని ఓడించాలి:CPM
♥ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం:కలెక్టర్లు
♥అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి:SPలు
♥ కొడంగల్: కాంగ్రెస్ లో 200 మంది చేరికలు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ.. పేదల హక్కులను హరించి, ధనికులకు మేలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ వ్యాఖ్యనించారు.
మక్తల్ పట్టణంలో ఆదివారం గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MBNR కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ అన్నారు. ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తి కాదన్నారు. గొల్ల కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రజలను ఆగం చేసిందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం ఉర్కొండ మండల పరిధిలోని మాదారంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజలను నమ్మించి ముంచినందుకు ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన జనజాతర సభలో అన్నారు. డీకే అరుణను కాంగ్రెస్సే ఎమ్మెల్యే చేసిందని, పార్టీని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్లు సంపాదించారని అన్నారు. ఈనెల 9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 5 నెలలు కాకుండానే 5గ్యారంటీ పథకాలు అమలు చేశామని, KTR పథకాలు అమలు కావడం లేదనడం విడ్డూరమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.