India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.
మహబూబ్ నగర్లోని ఏనుగొండ సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వై.సురేందర్ తెలిపారు. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈలో 10 తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎంపీసీ, బైపీసీలో కలిపి 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, ఈనెల 15 నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నాగర్కర్నూల్ లోక్ సభ పరిధిలో మొత్తం 69.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 17,38,254 ఓట్లకు గానూ 12,07,471 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,13,085 మంది పురుషులు, 5,94,967 మంది స్త్రీలు, 19 మంది ఇతరులు ఉన్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లో అత్యధికంగా 74.93, 74.06 శాతం పోలింగ్ కాగా.. అచ్చంపేట, కొల్లాపూర్లో అత్యల్పంగా 65.11 శాతం చొప్పున నమోదైంది. పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.
జిల్లాలో 10 తరగతి వార్షిక పరీక్షల్లో 2,127 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అత్యధికంగా గణితం సబ్జెక్టులో 594, సైన్స్ సబ్జెక్టులో 573 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరంతా జూన్ 3 నుంచి 13 వరకు జరిగే సప్లమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. వీరికి విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 1.90 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. అదనంగా మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.
పీయూ ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మూడేళ్ల పదవి కాలం ఈనెల 21తో ముగియనుంది. 2021 మే 21న పీయూ 6వ ఉపకులపతిగా రాష్ట్రంలో మరో 10 యూనివర్సిటీలకు కూడా అప్పుడే వీసీలు నియమితులయ్యారు. వీరి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు కసరత్తు మొదలుపెట్టింది. పీయూ వీసీ పదవికి మొత్తం 152 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా విశ్రాంతి ఆచార్యులు ఉన్నారు.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో మంగళవారం నాటికి 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు మిషన్ భగీరథ పథకం ఈఈ సుధాకర్ సింగ్ చెప్పారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ ద్వారా రేగుమాన్ గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను పంపులతో ఎత్తిపోస్తున్నారన్నారు. తాగునీరు అందించే ఎల్లూరు జలాశయంలో 0.35 టీఎంసీల సామర్థ్యం మేర పూర్తి స్థాయిలో నీటితో నింపుతున్నారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
SHARE IT..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సీబీఎస్సీ SSC ఫలితాల్లో సత్తాచాటారు. ఈ మేరకు శివకార్తీక్ 485, అలివేలి కీర్తి 478, మరో 34 మంది ఏ1 గ్రేడ్, 53 మంది ఏ2, 67 మంది బీ1, 59 మంది బీ2గా గ్రేడింగ్ పొందారు. ఎస్సెస్సీలో మొత్తం 84 మంది ఉత్తీర్ణులు అయినట్లు ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు.
2024-25 సంవత్సరం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అందించే పీజీ డిప్లొమా స్పోర్ట్స్, డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. గ్వాలియర్ లోని ది లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ కోచింగ్ అందించనున్నట్లు, ఆసక్తిగల వారు ఈనెల 20వ తేదీలోగా www.inipe.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని.. 25న అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.