India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశానికి సంబంధించి అత్యున్నత ఎన్నికలివి. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 296 మంది, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 228 మంది ఓటేశారు. ఇంకా చాలామంది వృద్ధులు పోలింగ్ కేంద్రానికి రావడానికి సిద్ధం అవుతున్నారని, మన రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో (MBNR, NGKL) పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం. రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం మరువద్దని అధికారులు పిలుపునిచ్చారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా రేపు ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.
1.ఓటర్ ఐడి 2.పాస్ పోర్ట్ 3.డ్రైవింగ్ లైసెన్స్ 4.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డులు 5.పోస్టాఫీసు పాస్ బుక్ 6.పాన్కార్డు 7.ఆర్టీజీ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు 8.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు 9.ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు10. ఫొటోతో కూడిన పింఛను పత్రం11. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు 12.ఆధార్ కార్డు, వీటిలో ఏదైనా ఒకటి చూపించి మీరు ఓటు వేయవచ్చు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
**GO VOTE.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..”881 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అతి సమస్యాత్మకమైన 58 పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు మోహరిస్తున్నామని, పోలింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు.
మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి ఈనెల 13న నిర్వహించే పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు రూ.2.41కోట్ల నగదు, రూ.1.81కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామని, నియోజకవర్గంలో పరిధిలో 927 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్తో ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు” వెల్లడించారు.
అలంపూర్ చౌరస్తా శివారులో జాతీయ రహదారిపై ఉన్న గురునానక్ ధాబాలో సిని హీరో అల్లు అర్జున్ భోజనం చేసి వెళ్లారు. శనివారం హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డాబా దగ్గర భోజనం చేశారు. అభిమానులు ఫొటోల కోసం పోటీపడ్డారు. అయితే దాబా యజమాని తిరుపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఫొటో దిగేందుకు అనుమతి ఇచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కంటే 48 గంటల ముందే అన్ని పార్టీల వాళ్లు ప్రచారం ఆపేశాయి. రెండు నెలలుగా ప్రచార వాహనాలు, పాటలతో హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచార వాహనాలకు అంటించిన పార్టీ స్టిక్కర్లు, హోర్డింగులకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు తొలగించేశారు.
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.