India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జోగులాంబ గద్వాల జిల్లాలో పలు మండలాల్లో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత కొనసాగనుందని పేర్కొంది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా వాసులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
టెన్త్ ఫలితాల్లో నారాయణపేట సత్తాచాటింది. 93.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7129 మంది పాసయ్యారు. MBNR(89.47%) 28వ స్థానంలో నిలవగా 11338 ఉత్తీర్ణత సాధించారు. NGKL(91.57) 23వ స్థానంలో ఉండగా 9621 పాసయ్యారు. WNP(86.93) 29వ స్థానంలో నిలవగా 5988 ఉత్తీర్ణత సాధించగా.. GDL(81.38) 32న స్థానంలో ఉండగా 5839 మంది పాసయ్యారు.
వనపర్తి: పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు స్థానిక కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ రోజు వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు https://polycet.sbtet.telangan.gov.in చూడాలన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో గత వారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులో చూశాయి. ఈనెల 22న షాపు యజమానిని రూ.50 విలువైన పండ్లను అడిగితే ఇవ్వలేదని ఆ షాపులో పనిచేసే వర్కర్ ఆసిద్ షాపుకు నిప్పు పెట్టినట్లు సీఐ కనకయ్య తెలిపారు. దీంతో మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మరో నాలుగు షాపులు కాలి బూడిద అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని పీజీ కళాశాలలకు విశ్వవిద్యాలయ అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు మే 1 నుంచి జూన్ 4 వరకు ఉంటాయన్నారు. జూన్ 5న కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ సెలవులు పాలమూరు విశ్వవిద్యాలయంతో పాటు పీజీ సెంటర్స్, పీజీ కళాశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
కారుకొండ శ్రీనివాసులు, ముంగి నవీన్ రెడ్డి, అదరి అంజయ్య, మల్లెల హరీందర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటరమణ, కె.ఉదయ్ తేజ్ నాయక్, సభావటి విజయ, గంబావత్ దినేష్, హనుమేశ్ , ముడావత్ బాలరాజు నాయక్, నడిమింటి శ్రీనివాసులు, పి. సందీప్ కుమార్ రెడ్డి, బండ సత్యనారాయణ, గోవిందమ్మ, సంగపాగ సరోజనమ్మ, కె. యాదగిరి, టి. విష్ణువర్ధన్ రెడ్డి, ఉమాశంకర్, కె.వెంకటయ్య మొత్తం 21 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మహ్మద్ అల్లావుద్దీన్(BSP), ఆంజనేయులు(ఎంజై స్వరాజ్ పార్టీ), రాకేశ్ (ధర్మ సమాజ్ పార్టీ), వెంకటేశ్వర్లు(అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మస్ పార్టీ), శంకర్ రెడ్డి (విడుతలై చిరుతైగల్ కచ్చి), రవీందర్(సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), నరేశ్ రెడ్డి(తెలంగాణ జాగీర్ పార్టీ), రహమాన్(బహు జన్ ముక్తి పార్టీ), స్వతంత్రులు 20 మంది ఉన్నారు.
✔పకడ్బందీగా ఎన్నికల నిర్వహణపై అధికారుల ఫోకస్
✔నేడు పలుచోట్ల ఓటరు స్లిప్పులు అందజేత
✔దామరగిద్ద:నేటి నుంచి గజలమ్మ జాతర ప్రారంభం
✔GDWL,NRPT:నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✔ఎంపీ ఎన్నికలు.. రెండో విడత శిక్షణకు సమ్మహాలు
✔పకడ్బందీగా తనిఖీలు
✔ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా అధికారుల ఫోకస్
నాగర్కర్నూల్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు ఎన్నికల సంఘం ‘విజిల్’ కేటాయించింది. తన లైఫ్ టర్న్ అయిన, లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన సింబల్ ‘విజిల్’ వచ్చిందని శిరీష హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎంతోమంది బెదిరించినా ఉపసంహరించుకోలేదన్నారు. నాగర్ కర్నూల్ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని.. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ ప్రసాద్(BJP), బీసమోళ్ల యూసఫ్(BSP), అమరనాథ్(ఇండియా ప్రజాబంధు పార్టీ), అయ్యప్ప సునీల్(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్), అంబోజు రవి(డెమోక్రటిక్ రిఫార్మ్), విజయ్(బహు జన్ ముక్తి పార్టీ), దాసరి భారతి(విదుతలై చిరుతైగల్ కచ్చి), ప్రాసంగి (పిరమిడ్ పార్టీ), విజయ్(విద్యార్థుల రాజకీయ పార్టీ), స్వతంత్రులు కర్నె శిరీష(బర్రెలక్క)తో పాటు 8 మంది బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.