India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపై దృష్టిసారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13న లోక్ సభ ఎన్నికలు ఉండగా.. ఒకరోజు ముందుగానే పార్టీల ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంది.
పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కాగా MBNR జిల్లాలో మొత్తం 12,866, NGKL 10,526, WNP-6,903, NRPT-7,678, గద్వాల 7,377 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్ను Way2News యాప్లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
KGBVలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావడంతో విచారణకు కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. దీనిపై అదనపు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి, అకౌంటెంట్, సీఆర్టీ ఉపాధ్యాయురాలు, అటెండర్ను విధుల నుంచి తొలగిస్తూ ఈనెల 25న డీఈవో ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంఈఓ సురేశ్ తెలిపారు.
జాతీయ స్థాయి చేనేత పురస్కారాలకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి గోవిందయ్య తెలిపారు. అర్హులు, ఆసక్తి గల కళాకారులు తమ దరఖాస్తులను మే 20లోగా కార్యాలయ వెబ్సైట్ www.handlooms.nic.in నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు సంబంధించి మూడు ప్రతులను HYDలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ బీ1, బీ2లో అందజేయాలన్నారు.
మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి 35 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీలో 35 మంది నామినేషన్లు ఆమోదించారు. వారిలో సోమవారం నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ ఉండనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఖైదీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ప్రిమెంట్ డిటర్మినేషన్ కింద వివిధ నేరాల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించారు. తమకు ఫలానా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని, దానిని వినియోగించుకుంటామని జైలర్ కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి జైలర్ ఆయా ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు.
జాతీయ సంత్ కబీర్& నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు-2023కి రాష్ట్ర ప్రభుత్వం, చేనేత జౌళి శాఖ దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా చేనేత మరియు జౌళిశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ, డిజైన్ లో నైపుణ్యం కనబరిచిన వారు మరియు చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన చేనేత కళాకారులకు ప్రతిష్టాత్మక సంత్ కబీర్ &నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు ఇవ్వబడుతుందని.. మే 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం లకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఎన్సీడీ పోర్టల్ లో లింక్ చేసే విధానంపై డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు అబా కార్స్ లింక్ చేసిన తర్వాత వారి సంఖ్యను జిల్లా ఆరోగ్య కేంద్రానికి తెలపాలన్నారు. ప్రాక్టికల్ గా ట్యాబ్ లో అబా కార్స్ లింక్ చేశారు.
ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. సోమవారం హన్వాడ మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. జూటా మాటలు చెప్పి, 6గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆమె అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
✒MP ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు: MBNRలో 31..NGKLలో 19 మంది అభ్యర్థులు
✒కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: దీపాదాస్ మున్సీ
✒MBNR:రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✒సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త: పోలీసులు
✒లింగాల:వివాహిత దారుణ హత్య
✒లోక్ సభ ఎన్నికలు.. పటిష్ఠ నిఘా:SPలు
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల స్లీప్స్ పంపిణీ
✒పోలీస్ ప్రజావాణి: సమస్య పరిష్కారం పై ఫోకస్
✒ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు
Sorry, no posts matched your criteria.