India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✏పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే BJP ఇవ్వలేదు:KTR
✏అమలు కానీ హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది: మన్నె శ్రీనివాస్ రెడ్డి
✏సోషల్ మీడియా పోస్టులపై నిఘా:SP గైక్వాడ్
✏BRS ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసింది: మంత్రి జూపల్లి
✏MBNR-13,221,NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు
✏BJPతోనే అభివృద్ధి సాధ్యం: భారత్ ప్రసాద్
✏’పాలీసెట్ గడువు పెంపు’..APPLY చేసుకోండి
✏EVM స్ట్రాంగ్ రూమ్ ల అధికారుల పరిశీలన
సార్వత్రిక ఎన్నికల సమరం మరికొన్ని రోజుల్లో జరగనుండగా ఎన్నికల సంఘం ఓటర్లకు పలు సూచనలు చేసింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్(VIS) లేనివారు వెంటనే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. దీనికోసం VOTER HELPLINE యాప్ ఇన్స్టాల్ చేసుకొని VIS డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే దీనిని చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. లేకపోతే మీ BLOని సంప్రదించాలని వెల్లడించింది.
MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ అధికారులు తెలిపారు. రేపటి నుండి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపిందని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మండలాల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఉండవల్లి, కేటి దొడ్డి, ఎర్రవల్లి, సీసీ కుంట, రాజాపూర్, మహమ్మదాబాద్, మూసాపేట, ఉప్పునుంతల, కడ్తాల్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, ఉల్కొండ, పెంట్లవల్లి, చిన్నంబావి,రేవల్లి, అమరచింత, కృష్ణ, నర్వ, మరికల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభ్యర్థులు, వారి తరఫు నాయకులు చేస్తున్న ప్రచారాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబితే విని ఓట్లు వేసే పరిస్థితిలో లేకుండా పోతున్నాయి. అందరికీ జై అంటున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారు అన్నది బయటపడడం లేదు. అటూ అభ్యర్థుల ప్రచారాల్లో కొన్ని మార్పులుచేర్పులు చేస్తూ సాగుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై నిఘా పెట్టినట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. వాట్సప్, ఫేస్ బుక్, X, తదితర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ఇతర పార్టీలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొల్లాపూర్ పట్టణంలోని 10 వార్డులో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుని, తీరని అన్యాయం చేసిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ సీటుపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్ఎస్పీకి మద్దతుగా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తి, అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ గెలుపుపై సానుకూల పవనాలు ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.
ఇంటర్ ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అమరచింత మం. సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మం. ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. దీంతో 10రోజులుగా దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది.
Sorry, no posts matched your criteria.