India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☞రైతుబంధు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
☞ప్రజల సొమ్మును రైతులకు ఇవ్వడానికి వచ్చిన నష్టమేంటి?
☞రైతులంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా?
☞తాగునీటి కోసం మహిళలు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చేసే రోజులు వచ్చాయి.
☞సొంత గడ్డకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో RSP రాజకీయాల్లో వచ్చారు. ఆయనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారు మోగింది..
నాగర్ కర్నూల్ BRS MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని MPగా గెలిపించుకుంటే మన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం KCR అన్నారు. నాగర్ కర్నూల్లో శనివారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన RS ప్రవీణ్ కుమార్ వాటిని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు అని అన్నారు.
జిల్లా ప్రజలు 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం ఆయన ఛాంబర్ మాట్లాడుతూ.. 5 రోజులపాటు జిల్లాలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వేళలో ఎవరు ఎండలో తిరగరాదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. లేత తెలుపు రంగు వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు.
షాద్ నగర్ పరిధిలోని ఎలకిచర్ల, జిల్లేడు చౌదరిగూడలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శనివారం రోడ్ షో నిర్వహించారు. అరుణ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు.. అయన సీఎం స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రజాధరణ కోల్పోయిందన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి భూమిని కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లేడు చౌదరి గుడా మండలంలోని వీరన్న పేట గ్రామానికి చెందిన రైతు గడ్డం వెంకటయ్యకు సంబంధించిన 30 గుంటల భూమిని అధికారులు ఇతరుల పేరున చేశారు. రైతు బంధు రావడం లేదంటూ అధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 9 మంది రెవెన్యూ సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవలో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్వాడీ కుటుంబ సర్వే ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ల నుంచి 300 ఇళ్లు ఉండేలా సర్దుబాటు చేసి, సంబంధిత వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్ లో సర్వేను ఒకే సారి పొందుపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,321 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెళ్లిళ్లు శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేకు పడనుంది. గత నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు అంచనా వేశారు. ఈ నాలుగు నెలల్లో బ్రాహ్మణులు, ఇతర కుల వృత్తుల వారు, బంగారం వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులు, టాక్సీలు, వస్త్ర వ్యాపారులకు చేతినిండా పని దొరికింది. మూఢంతో 4 నెలల పాటు పని లేకుండా పోయిందని పలువురు అన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు..
✓ మహబూబ్నగర్ – 275, ✓ జడ్చర్ల – 274, ✓ దేవరకద్ర – 289, ✓ నారాయణపేట – 270, ✓ మక్తల్ – 284, ✓ కొడంగల్ – 282
✓ షాద్నగర్ – 263, ✓ నాగర్ కర్నూల్ – 264
✓ అచ్చంపేట – 339, ✓ కల్వకుర్తి – 271
✓ కొల్లాపూర్ – 292, ✓ వనపర్తి – 307
✓ గద్వాల – 303, ✓ అలంపూర్ – 291
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,004 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.