India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్వ మండల వైద్యాధికారి డాక్టర్ కేశవ్ను విధుల నుంచి సస్సెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిన మండల వైద్యాధికారిగా ఉన్న కేశవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారని, విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో సస్సెండ్ చేసినట్లు చెప్పారు. ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. వంగూరు మండలానికి చెందిన వెంకటేశ్(28), జిల్లెల్ల గ్రామానికి చెందిన రాములు(29) బైక్పై కల్వకుర్తి వైపు నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ్ర గ్రామ చౌరస్తాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే అయినప్పటికీ తమ అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో చెమటలోడుస్తున్నారు. ఈ వారం రోజుల్లో పడే శ్రమ, వ్యూహరచన కీలకం కావడంతో ఆయా అభ్యర్థులు, నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్లజాబితా ప్రకారం MBNRలో 50.53, NGKLలో 50.24 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు
భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రతీ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై పలు ప్రాంతాలు రెడ్జోన్ లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాలుగా యత్నిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలను తాగు తుండగా, ఎక్కువ మంది తాటి ముంజలను తినేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలోనే ప్రత్యేకంగా లభించే తాటి ముంజలకు జిల్లాలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే.. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. ఉమ్మడి పాలమూరులోని NGKL, MBNR పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తానని మహబూబ్నగర్ కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. ‘పార్లమెంట్ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్ ఐటీ హబ్ లను డెవలప్ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్ స్కూల్ ను మంజూరు చేయిస్తా’ అని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈనెల 5న AICC అగ్రనేత రాహుల్ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని మోదీ ఈనెల10న NRPTకు రానున్నారు. నేడు రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించనున్న కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
MBNR ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) విద్యార్హత ఇంటర్ కాగా.. BJP అభ్యర్థి డీకే అరుణ ఎస్ఎస్సీ చదివారు. NGKL లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి MBBS చేయగా.. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చదివారు. BRS అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేశారు. ఈ మేరకు అఫిడవిట్లో పేర్కొన్నారు.
భార్యాభర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వెంకటేశ్వర్లు వివరాలు.. గోపాల్పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు HYDలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్లీ గొడవ పడ్డారు. భర్త మనస్తాపంతో నిన్న ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.