India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటనకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీఐజీ ఎల్ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం సీఎం పర్యటించనున్న తిమ్మారెడ్డిపల్లిలోని గురులోకామసంద్ దేవాలయం, మద్దూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమయ్యే ఫంక్షన్ హాల్ను పరిశీలించారు. ఆలయంలో పూజలు నిర్వహించి బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ యోగేష్ పాల్గొన్నారు.
నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య దర్శనం ఓ మహోత్తర ఘట్టం. ప్రతి ఏటా ఏప్రిల్లో వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతుంది. స్వామివారి దర్శనం కోసం చిన్నా.. పెద్ద, ధనిక.. పేద తేడాలేకుండా అందరూ అడవిలో గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నా లింగమయ్యా’.. తిరిగి వెళ్లేప్పుడు ‘వెళ్లొస్తాం లింగమయ్యా’ అంటు భక్తి పరవశ్యంలో మునిగితేలుతారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి . ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 23 నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 27న రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీంతో స్థానిక నేతలు జనసమీకరణలో నిమగ్నమైయ్యారు. ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని సలేశ్వరంలో కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం దాని మీద ఇత్తడితో చేసిన నాగ పడగను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకొనేందుకు వెన్నెల రాత్రిలో వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి కారడవిలో ప్రయాణిస్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల అభయారణ్యం పులకించిపోతోంది. పైనుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు కొండపైకి ఎగబాకి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకులలో ఆదివారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాలానగర్లో 42.7, కోయిలకొండలో 42.3, మూసాపేటలో 42.2, మిడ్జిల్లో 41.9, మహబూబ్ నగర్లో 41.5, జడ్చర్లలో 41.3 డిగ్రీలు నమోదు కాగా, నవాబ్ పేటలో అత్యల్పంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతతోపాటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో BRS అధ్యక్షుడు KCR, కార్యనిర్వాహక అధ్యక్షులు KTR పర్యటనలు ఖరారయ్యాయి. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అలంపూర్ X రోడ్లో నిర్వహించే BRS ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 27న శనివారం నాగర్ కర్నూల్లో బస్సు యాత్ర, భారీ రోడ్ షోలో KCR పాల్గొననున్నారు. ఈ రెండు సమావేశాలు భారీఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్ర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 85.04 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త, బీచుపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, మొత్తం 11,660 మంది విద్యార్థులకు గాను 9,920 మంది హాజరయ్యారని ఆయన వివరించారు.
మేడ్చల్ కోర్టు నుంచి MBNR జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జిగా కె.కల్యాణ చక్రవర్తి బదిలీపై రానున్నారు. అదేవిధంగా పాస్ట్ట్రాక్, మహిళా కోర్టు జడ్జిగా పనిచేస్తున్న వై.పద్మ HYD సిటీ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యారు. GDL జిల్లా కోర్టులో మొదటి అదనపు జిల్లా అండ్ సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న అన్నె రోస్ క్రిస్టియానా HYD CT కోర్టుకు బదిలీ అయ్యారు. MBNR SC,ST కోర్టు జడ్జి శ్రీదేవి బదిలీ అయ్యారు.
రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. కొత్తకోట మండలం కనిపెట్ట గ్రామానికి చెందిన భాస్కర్(23) వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఫార్మసీ చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి కొత్తకోటకు బైక్పై వెళ్తుండగా పాలెం సమీపంలో కారు ఢీకొట్టింది. భాస్కర్ తలకు తీవ్ర గాయం కాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైందని SI మంజునాథ్ రెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2024కు <<13099468>>దరఖాస్తుల గడువు<<>> ముగిసింది. మార్చి 27 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి టెట్కు మొత్తం 43,557 మంది దరఖాస్తు చేసుకున్నారు. TET-2024లో భాగంగా పేపర్-1కు 17,608, పేపర్-2కు 25,949 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరీక్షకు మే 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.